News April 12, 2025
సిద్దిపేట: వేర్వేరు కారణాలతో నలుగురు సూసైడ్

సిద్దిపేట జిల్లాలో వేర్వేరు కారణాలతో నిన్న నలుగురు సూసైడ్ చేసుకున్నారు. చిన్నకోడూరుకు చెందిన రేపాక రోహిత్(22) అప్పుల బాధతో ఇంట్లో ఉరేసుకోగా.. ములుగు మం, మామిడ్యాల R&B కాలనీకి చెందిన స్వామి(23) కడుపునొప్పి భరించలేక పురుగుమందు తాగాడు. రాయపోల్ మం. చిన్నమాసాన్ పల్లికి చెందిన యాదయ్య(59) కుటుంబ సభ్యలు మందలించారని, దుబ్బాక మం. రాజక్కపేటకు చెందిన ఎలక్ట్రీషియన్ <<16060530>>మోహన్<<>>(50) ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకున్నారు.
Similar News
News March 14, 2026
వరి ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ వన్: తుమ్మల

TG: వరి ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ నంబర్ వన్ ప్లేస్లో ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ క్రమంలో రైతులకు మెరుగైన ఆదాయం అందించేందుకు ఎగుమతులు, విలువ ఆధారిత ఉత్పత్తులు, ఫుడ్ ప్రాసెసింగ్లపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడేలా గ్రేడింగ్, ప్రాసెసింగ్, బ్రాండింగ్, నాణ్యతా ప్రమాణాలు మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు.
News March 14, 2026
HYD: అనసూయపై అసభ్యకర మెసేజ్లు చేసింది ఇతడే!

నటి అనసూయను సోషల్ మీడియాలో వేధించిన వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఆన్లైన్లో వేధింపులపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు జనార్థన్ను(26)ను అదుపులోకి తీసుకున్నారు. ఏపీ కడప జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కొంతకాలంగా నగరంలో నివాసం ఉంటున్నాడు. ఇటీవల అనసూయ మీద SMలో అసభ్యకరమైన మెసేజ్లు చేయడంతో ఆమె ఫిర్యాదు మేరకు అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.
News March 14, 2026
పెద్దపల్లి: ‘రేపు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి పాదయాత్ర’

మహాశక్తి ఆలయం కరీంనగర్ నుండి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో రేపు కొండగట్టు వరకు మహా పాదయాత్ర నిర్వహిస్తున్నారు. కావున పెద్దపల్లి జిల్లా ఆయా మండలాల నుండి అధిక సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు హిందూ బంధువులు పాల్గొని మహా పాదయాత్ర ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ రావు పెద్దపల్లి బీజేపీ కార్యాలయం నుండి పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో నల్ల మనోహర్ రెడ్డి ఉన్నారు.


