News April 12, 2025
వనజీవి రామయ్య మృతి ధరిత్రికి తీరని లోటు: తుమ్మల

చెట్లనే ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి వనజీవి రామయ్య మరణం ధరిత్రికి తీరని లోటని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వనజీవి రామయ్య మృతి పట్ల మంత్రి తుమ్మల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోటికి పైగా మొక్కలు నాటి, పద్మశ్రీ అవార్డు దక్కించుకున్న రామయ్య ఖమ్మం జిల్లా ఖ్యాతిని ఖండాంతరాలకు చాటారని మంత్రి తుమ్మల గుర్తు చేసుకున్నారు.
Similar News
News November 6, 2025
అనకాపల్లి: ఈ నెల 11 నుంచి క్రీడల ఎంపిక పోటీలు

సివిల్ సర్వీసెస్ ప్రభుత్వ ఉద్యోగుల జిల్లాస్థాయి క్రీడల ఎంపిక పోటీలు ఈనెల 11 నుంచి 13 వరకు అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియం, షుగర్ ఫ్యాక్టరీ గ్రౌండ్, పరవాడ ఇండోర్ స్టేడియం, అనకాపల్లి జార్జ్ క్లబ్ వద్ద నిర్వహించనున్నారు. ఈ వివరాలను జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పూజారి శైలజ గురువారం వెల్లడించారు. ఈ పోటీల్లో ఎంపికైన వారు ఈనెల 19 నుంచి జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.
News November 6, 2025
ప్రముఖ ట్రావెల్ యూట్యూబర్ మృతి

ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబర్ అనునయ్ సూద్(32) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు ఇన్స్టాలో వెల్లడించారు. ఆయన మృతికి కారణాలు తెలియరాలేదు. నోయిడాకు చెందిన అనునయ్ దుబాయ్లో ట్రావెల్ ఫొటోగ్రాఫర్గా పనిచేస్తున్నారు. 46 దేశాల్లో పర్యటించిన ఆయనకు ఇన్స్టాలో 14L, యూట్యూబ్లో 3.80L మంది ఫాలోవర్లు ఉన్నారు. 2022, 23, 24లో ఫోర్బ్స్ ఇండియా టాప్-100 డిజిటల్ స్టార్స్ జాబితాలో చోటుదక్కించుకున్నారు.
News November 6, 2025
మెంటాడ మార్పుపై ఎటువంటి ప్రతిపాదన చేయలేదు: మంత్రి

మెంటాడ మండలాన్ని మన్యం జిల్లాలో చేర్చాలనే అంశంపై తాను ఎటువంటి ప్రతిపాదన చేయలేదని మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. జడ్పీ సమావేశంలో జడ్పీటీసీ సన్యాసినాయుడు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. పత్రికల్లో వచ్చిన కథనాలు చూసి ఆందోళనలో చేపడుతున్నారన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం ఇతర జిల్లాల నుంచి మాత్రమే ప్రతిపాదనలు వచ్చినట్లు పేర్కొన్నారు. అనవసర ఆందోళనలు వద్దని సూచించారు.


