News April 12, 2025

కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ సస్పెండ్

image

కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ కోవూరి ఆనందరావును సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తునికి చెందిన ఓ గ్యాస్ ఏజెన్సీ ఆస్తి పేరు మార్చడానికి లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ గత నెల 28న ఆనందరావు ఏసీబీకి పట్టుబడ్డారు. ఇద్దరిని విచారించి రిజిస్ట్రార్ ఆనందరావును సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వులు జారీ చేశారు.

Similar News

News January 17, 2026

ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఇవి గుర్తించుకోండి

image

ప్రతి ఒక్కరికీ ఇన్సూరెన్స్ అవసరమే అయినా, సరైన అవగాహన లేకుంటే నష్టమే వస్తుంది. పాలసీ తీసుకునే ముందు వివిధ కంపెనీల ఆఫర్లను కంపేర్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. పాలసీ నిబంధనలను పూర్తిగా చదవాలని, క్లెయిమ్ ప్రక్రియ వేగంగా జరిగే కంపెనీలను ఎంచుకోవాలని అంటున్నారు. భవిష్యత్ అవసరాలను అంచనా వేసి రైడర్లను తీసుకుంటే మరింత బాగుంటుంది.

News January 17, 2026

ఖమ్మం: మేడారం చెంతకు RTC బస్సులు.. టికెట్ ధరలు ఇవే!

image

సమ్మక్క-సారలమ్మ మేడారం జాతర-2026 సందర్భంగా భక్తుల కోసం TGSRTC అధికారులు ప్రత్యేక బస్సు ఛార్జీలను ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సుల ధరల పట్టికను విడుదల చేశారు. ఖమ్మం నుంచి రూ.480, కొత్తగూడెం- రూ.350, పాల్వంచ- రూ.310, మణుగూరు- రూ.210, భద్రాచలం- రూ.300, ఇల్లందు- రూ.400, ఇల్లందు వయా గుండాల- రూ.270గా ఖరారు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సులను నడుపుతామని చెప్పారు.

News January 17, 2026

మళ్లీ చెప్పున్నా.. జాగ్రత్త: కర్నూలు ఇన్‌ఛార్జ్ ఎస్పీ

image

ప్రభుత్వ పథకాల పేరుతో సైబర్‌ నేరగాళ్లు SMలో ఫేక్‌ లింకులు పంపి మోసం చేస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలను డీఐజీ, కర్నూలు ఇన్‌ఛార్జ్‌ ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ హెచ్చరించారు. పీఎం కిసాన్‌, ముద్ర లోన్స్‌, సూర్యఘర్‌, అమ్మఒడి వంటి పథకాల పేరుతో వచ్చే లింకులను క్లిక్‌ చేయవద్దన్నారు. బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు ఎవరికీ చెప్పవద్దన్నారు. అనుమానాస్పద కాల్స్‌, లింకులు వస్తే 1930కు ఫోన్‌ చేయాలన్నారు.