News April 12, 2025
NLG: ఆస్తికోసం కూతురిని చంపిన సవతి తల్లి

ఆస్తికోసం కూతురిని పినతల్లి చంపిన ఘటన గతేడాది DEC 7న జరగ్గా పోలీసులు ఈ కేసును ఛేదించారు. వారు తెలిపిన వివరాలిలా.. కూతురిని సవతితల్లి హతమార్చి వంగమర్తి వాగులో మృతదేహాన్ని పూడ్చారు. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో మేడిపల్లి PSలో మిస్సింగ్ కేసు నమోదైంది. మహేశ్వరి మృతదేహాన్ని వెలికి తీసి, పోస్టుమార్టం చేసి బంధువులకు అప్పగించారు.
Similar News
News March 27, 2026
GNT: ‘రీసెర్చ్ నెక్సస్’ జర్నల్ ఆవిష్కరించిన జస్టిస్ రామకృష్ణ ప్రసాద్

వడ్లమూడి విజ్ఞాన్ వర్సిటీలో ‘రీసెర్చ్ నెక్సస్’ జర్నల్ను ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ ఆవిష్కరించారు. విద్యార్థులు నిజాయతీ, నిబద్ధతతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం ఉద్యోగాలు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులను సత్కరించారు. కార్యక్రమంలో విజ్ఞాన్ గ్రూప్ ఛైర్మన్ లావు రత్తయ్య, వైస్ ఛైర్మన్ శ్రీకృష్ణ దేవరాయలు పాల్గొని విద్యార్థులను అభినందించారు.
News March 27, 2026
GNT: ‘రీసెర్చ్ నెక్సస్’ జర్నల్ ఆవిష్కరించిన జస్టిస్ రామకృష్ణ ప్రసాద్

వడ్లమూడి విజ్ఞాన్ వర్సిటీలో ‘రీసెర్చ్ నెక్సస్’ జర్నల్ను ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ ఆవిష్కరించారు. విద్యార్థులు నిజాయతీ, నిబద్ధతతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం ఉద్యోగాలు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులను సత్కరించారు. కార్యక్రమంలో విజ్ఞాన్ గ్రూప్ ఛైర్మన్ లావు రత్తయ్య, వైస్ ఛైర్మన్ శ్రీకృష్ణ దేవరాయలు పాల్గొని విద్యార్థులను అభినందించారు.
News March 27, 2026
తుళ్లూరు: APCRDA గ్రీవెన్స్ డే వాయిదా

అమరావతి ప్రాంత రైతులు, కూలీల సమస్యల పరిష్కారానికి ప్రతి శనివారం నిర్వహించే గ్రీవెన్స్ డే ఈ నెల 28న జరగదని APCRDA వెల్లడించింది. కొన్ని నిర్వహణ కారణాల వల్ల శనివారం నాటి కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. వాయిదా పడిన ఈ ఫిర్యాదుల పరిష్కార వేదికను మార్చి 30న సోమవారం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. రాజధాని ప్రాంత ప్రజలు, రైతులు ఈ మార్పును గమనించి సహకరించాలని అధికారులు కోరారు.


