News April 12, 2025
కరీంనగర్: ఉద్యోగం పేరుతో మోసం.. కేసు నమోదు

విదేశాలలో ఉద్యోగం పేరుతో యువకుడిని మోసంచేసిన వ్యక్తిపై కేసునమోదుచేసినట్లు 2టౌన్ సీఐ సృజన్రెడ్డి తెలిపారు. KNRభగత్నగర్కు చెందిన మెహర్తేజను HYDకు చెందిన ప్రశాంతరాథోడ్ బ్యాంకాక్లో బిజినెస్ ప్రాసెస్ ఉద్యోగం ఇప్పిస్తానని కొంత డబ్బుతీసుకొని బ్యాంకాక్ పంపించాడు. అక్కడ మోసపూరిత సంస్థలో చేర్పించి పాస్పోర్ట్ తీసుకొని నిర్బంధించారని, అక్కడి పోలీసుల సహాయంతో వచ్చానని ఫిర్యాదులో బాధితుడు పేర్కొన్నాడన్నారు.
Similar News
News November 4, 2025
ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలి: శ్రీకాకుళం కలెక్టర్

ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. మంగళవారం శ్రీకాకుళం కలెక్టర్ మందిరంలో సమీక్ష నిర్వహించారు. 6.50 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యాన్ని చేరుకోవడానికి 5500 వాహనాలకు జీపీఎస్ వినియోగం సాధ్యం కానందున 9 బృందాలను ఏర్పాటు చేసి ట్రాకింగ్ డివైజ్లు ఇన్స్టాల్ చేయాలన్నారు. 200 ఈ-హబ్ ఛార్జింగ్ స్టేషన్లకు స్థలం పరిశీలించాలన్నారు.
News November 4, 2025
నంగునూరు: రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు మల్యాల విద్యార్థి

69వ ఎస్జీఎఫ్ఐ (SGFI) రాష్ట్రస్థాయి అండర్-17 కబడ్డీ పోటీలకు నంగునూరు మండలం గట్ల మల్యాల జడ్పీహెచ్ఎస్ విద్యార్థిని డి. అను ఎంపికైనట్లు హెచ్ఎం రమేష్ తెలిపారు. జిల్లా స్థాయిలో మొదటి స్థానం, జోనల్ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఆమె రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ఈ నెల 8, 9, 10న భద్రాద్రి కొత్తగూడెంలో జరిగే పోటీల్లో అను పాల్గొంటారని తెలిపారు. ప్రధానోపాధ్యాయులు అభినందించారు.
News November 4, 2025
బహ్రెయిన్లో మెట్పల్లివాసి అంత్యక్రియలు.. సన్నాహాలు

5ఏళ్ల క్రితం బహ్రెయిన్లో మృతిచెందిన మెట్పల్లివాసి శ్రీపాద నరేష్ శవం అక్కడి శవాగారంలోనే మగ్గుతోంది. శవాన్ని భారత్కు పంపడం సాధ్యం కాదని ఎంబసీ అధికారులు స్పష్టం చేయడంతో బహ్రెయిన్లోనే అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబీకులు నిరంభ్యంతర పత్రంపై సంతకం చేశారు. తదుపరి చర్యలకోసం MLA సంజయ్ మృతుని సోదరుడు ఆనంద్తో కలిసి నిరంభ్యంతర పత్రాన్ని ప్రవాసి ప్రజావాణి ఇన్ఛార్జ్ చిన్నారెడ్డికి, భీంరెడ్డికి అందించారు.


