News April 12, 2025
కావలిలో మోసం

కావలిలో మరో మోసం వెలుగు చూసింది. కలిగిరికి చెందిన ఓవ్యక్తి పాతూరు శివాలయం వద్ద నాలుగేళ్లుగా ఉంటూ ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తున్నాడు. ముందుగా ఒక్కొక్కరి నుంచి రూ.50వేలు తీసుకుని నెలకు రూ.7వేలు చొప్పున వాళ్లకు ఇచ్చి నమ్మించాడు. ఆ తర్వాత రూ.2కోట్ల వరకు వసూళ్లు చేసి రూ.లక్షకు రూ.14 వేల చొప్పున ఫిబ్రవరి వరకు ఇచ్చాడు. ఆ తర్వాత ఫోన్ లిప్ట్ చేయలేదు. ఇంటికి సైతం తాళం వేసి ఉండటంతో బాధితులు లబోదిబోమంటున్నారు.
Similar News
News March 2, 2026
నెల్లూరు: చికిత్స పొందుతూ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి

కోవూరు(m), పాటూరుకు చెందిన పవన్ సాయి(19) గంగవరంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గత నెల 27న తన ఇంట్లోనే గడ్డి ముందు సేవించాడు. వాంతులు రావడంతో గమనించిన తండ్రి చికిత్స నిమిత్తం నెల్లూరు ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 2, 2026
‘నెల్లూరు కలెక్టర్ చొరవతో నా ఇల్లు నాకు వచ్చిందయ్యా’

‘కలెక్టర్ బాబు చొరవతో నా ఇల్లు నాకు వచ్చిందయ్యా’ అంటూ కావలికి చెందిన రమాజ్యోతి అనే వృద్ధురాలు ధన్యవాదాలు చెప్పేందుకు ప్రత్యేకంగా కలెక్టరేట్కు వచ్చారు. 2025 సెప్టెంబర్ 22న నడవలేని స్థితిలో ఉన్న రమాజ్యోతి కలెక్టరేట్కి వచ్చింది. కలెక్టర్ ఆమె సమస్యను అడిగి తెలుసుకొని పరిష్కారం చూపారు. కలెక్టర్గా హిమాన్షు శుక్లా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నిర్వహించిన తొలి PGRSలో అందిన మొదటి అర్జీ ఇదే కావడం విశేషం.
News March 2, 2026
నెల్లూరులో ‘ఆపరేషన్ చిన్నారి తల్లి’

నెల్లూరు ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా ‘ఆపరేషన్ చిన్నారి తల్లి’ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. పిల్లలపై లైంగిక నేరాల నిరోధం, బాల్య వివాహాల నిర్మూలన, పోక్సో చట్టంపై శక్తి బృందాలు పాఠశాలల్లో అవగాహన కల్పిస్తున్నాయి. అసాంఘిక శక్తులపై నిఘా పెంచుతూ.. పిల్లల రక్షణ కోసం డయల్ 100, 1098 సేవలను వినియోగించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.


