News April 12, 2025
తూ.గో. జిల్లాకు 4వ స్థానం

ఇంటర్ ఫలితాల్లో తూ.గో.జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఇంటర్ సెకండ్ ఇయర్లో 17,575 మంది పరీక్షలు రాయగా 15,362 మంది పాసయ్యారు. 87 శాతం పాస్ పర్సంటేజీతో తూ.గో.జిల్లా రాష్ట్రంలోనే 4వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ ఇయర్లో 20,083 మందికి 15,529 మంది పాసయ్యారు. 77శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 5వ స్థానంలో తూ.గో.జిల్లా నిలిచింది.
Similar News
News April 14, 2025
రాజమండ్రి: ప్రజలకు ఎస్పీ సూచనలు

భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరుగని కృషిచేసిన భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. రేపు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ప్రజలు జయంతి పండగ ఉత్సవాలను జరుపుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు.
News April 13, 2025
కోరుకొండ: పొట్ట కూటి కోసం వెళ్లి విగతజీవులుగా మారారు.

కోరుకొండ(M) కాపవరంలో నిన్న రైలు మిల్లులో కరెంట్ షాక్తో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే.
అయితే వారు పొట్ట కూటి కోసం వెళ్లి విగతజీవులుగా మారారు. ప్రమాదంలో మరణించిన శ్రీరామ్, సత్యనారాయణ, వెంకటేశ్వరరావు రెక్కాడితే కాని డొక్కాడని రైతు కూలీలు. డైలీ రైస్ మిల్లుకు వెళ్లి లారీ నుంచి ధాన్యం బస్తాలు దింపి మిల్లుకు వేస్తుంటారు. కుటుంబంలో పెద్ద దిక్కుకుగా ఉన్నవారు చనిపోవడంతో దిక్కులేని వారయ్యారు.
News April 13, 2025
రాజమండ్రి: స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను అభినందించిన డీఐజీ

ప్రవీణ్ కుమార్ పగడాల కేసు ఛేదించేందుకు అవసరమైన సాక్ష్యాలు సేకరించడంలో ఎంతో ప్రతిభ చాటిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని DIG అశోక్ కుమార్ అభినందించారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో విలేకర్ల సమావేశం అనంతరం SIT టీంను డీఐజీ, ఎస్పీ నరసింహ కిషోర్ ప్రత్యేకంగా సన్మానించారు. సుమారు 400కుపైగా సీసీ కెమెరాలను పరిశీలించి కేసును కొలిక్కి తేవడంలో SIT అద్భుత ప్రతిభ చాటిందని ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు.