News April 12, 2025
కాకినాడ జిల్లాకు 20వ స్థానం

ఇంటర్ ఫలితాల్లో కాకినాడ జిల్లా విద్యార్థులు నిరాశ పరిచారు. ఇంటర్ సెకండ్ ఇయర్లో 17,326 మంది పరీక్షలు రాయగా 13,582 మంది పాసయ్యారు. 78 శాతం పాస్ పర్సంటేజీతో కాకినాడ జిల్లా రాష్ట్రంలో 20వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ ఇయర్లో 20,398 మందికి 12,920 మంది పాసయ్యారు. 63 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 15వ స్థానంలో కాకినాడ జిల్లా నిలిచింది.
Similar News
News January 12, 2026
మకర జ్యోతి పర్వదినానికి భారీ ఏర్పాట్లు

కేరళలోని శబరిమలలో జనవరి 14న జరగనున్న మకరవిలక్కు (మకర జ్యోతి) దర్శనానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఏడీఎం అరుణ్ ఎస్ నాయర్ తెలిపారు. భక్తుల భద్రత కోసం బారికేడ్లు, ఇతర సౌకర్యాలు సిద్ధం చేశామన్నారు. హైకోర్టు ఆదేశాలతో దర్శనానికి కఠిన పరిమితులు విధించారు. 14న వర్చువల్ క్యూ ద్వారా 30 వేల మందికే అనుమతి ఉంటుంది. తిరువాభరణ ఊరేగింపు నేపథ్యంలో పంబా-సన్నిధానం మార్గంలో తాత్కాలిక ఆంక్షలు అమలు చేయనున్నారు.
News January 12, 2026
VZM: ‘పీజీఆర్ఎస్ని ప్రజలు వినియోగించుకోవాలి’

జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం విజయనగరం కలెక్టరేట్లో PGRS నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలు నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొని అర్జీలు స్వీకరిస్తారన్నారు. మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లోనూ అర్జీల స్వీకరణ ఉంటుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
News January 12, 2026
నేడే PSLV-C62 ప్రయోగం

AP: ఈ ఏడాదిలో తొలి ప్రయోగానికి ISRO సిద్ధమైంది. తిరుపతి(D) శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి PSLV-C62 రాకెట్ ఈ రోజు ఉదయం 10.18 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగంలో ప్రధానంగా అధునాతన భూపరిశీలన ఉపగ్రహం EOS-N1ను రోదసిలోకి పంపనున్నారు. దీనికి తోడుగా 8 దేశాలకు చెందిన మరో 15 చిన్న ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. ఇవి పర్యావరణం, వాతావరణ మార్పులపై అధ్యయనం చేయనున్నాయి.


