News April 12, 2025
ఇంటర్ ఫలితాలలో కాస్త వెనుకబడ్డ నంద్యాల

ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. నంద్యాల జిల్లాలో సెకండ్ ఇయర్లో 10,665 మంది మంది పరీక్షలు రాయగా 8,374 మంది పాసయ్యారు. 79 శాతం పాస్ పర్సంటేజీతో నంద్యాల రాష్ట్రంలోనే 18వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ ఇయర్లో 13,828 మందికి 8,288 మంది పాసయ్యారు. 60 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 22వ స్థానంలో జిల్లా నిలిచింది.
Similar News
News September 15, 2025
పారిశుద్ధ్య కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించండి: KMR కలెక్టర్

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని KMR కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాల వల్ల నీరు నిలిచి దోమలు వృద్ధి చెందే అవకాశం ఉన్నందున అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను పర్యవేక్షించాలని జిల్లా పంచాయతీ అధికారి మురళీ, మున్సిపల్ కమిషనర్లకు సూచించారు.
News September 15, 2025
శ్రీసత్యసాయి జిల్లా వ్యాప్తంగా పోలీసుల వాహన తనిఖీలు

శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్ ఆదేశాలతో సోమవారం సాయంత్రం పోలీసులు జిల్లా వ్యాప్తంగా వాహనాల తనిఖీలు నిర్వహించి ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టారు. ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించగా హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరి అని అవగాహన కల్పిస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్లకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.
News September 15, 2025
BREAKING: కాలేజీలతో చర్చలు సఫలం

TG: కాలేజీల యాజమాన్యాలతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో రేపటి నుంచి కాలేజీలు యథావిధిగా నడవనున్నాయి. ప్రస్తుతం రూ.600కోట్ల బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీపావళికి మరో రూ.600కోట్లు రిలీజ్ చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు బంద్ను విరమించుకున్నాయి.