News April 12, 2025

ఇంటర్ ఫలితాలలో కాస్త వెనుకబడ్డ నంద్యాల

image

ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. నంద్యాల జిల్లాలో సెకండ్ ఇయర్‌లో 10,665 మంది మంది పరీక్షలు రాయగా 8,374 మంది పాసయ్యారు. 79 శాతం పాస్ పర్సంటేజీతో నంద్యాల రాష్ట్రంలోనే 18వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ ఇయర్‌లో 13,828 మందికి 8,288 మంది పాసయ్యారు. 60 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 22వ స్థానంలో జిల్లా నిలిచింది.

Similar News

News November 3, 2025

ఎయిడ్స్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

జిల్లాలో ఎయిడ్స్ నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ DK బాలాజీ వైద్యాధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ కమిటీ సమావేశం జరిగింది. ఎయిడ్స్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను కమిటీ సభ్యులతో చర్చించారు. వైద్య పరీక్షల కోసం ART సెంటర్లకు వచ్చే ప్రజలకు అందుబాటులో ఉన్న లేబరేటరీలు, చికిత్స, కౌన్సిలింగ్ సెంటర్లు, ఇతర సౌకర్యాలపై అరా తీశారు.

News November 3, 2025

పరమాత్ముడి గుణాలను మనం వర్ణించగలమా?

image

పరమాత్ముడి గుణాలు అనంతం. వాటిని లెక్కించడం అసాధ్యం. ఆయన మనపై కరుణతోనే ఎన్నో అవతారాలు ఎత్తాడు. అందులో రామావతారం ఒకటి. ఆ మర్యాద పురుషోత్తముడి గుణాలను ఆదిశేషుడు, మహర్షులు కూడా పూర్తిగా వర్ణించలేరు. అయినా భక్తులు శాస్త్రాలలో ఆయన మహిమలను కీర్తించి, పాటించి, ఇతరులకు తెలిసేలా చేస్తున్నారు. మనం కూడా ఆ దైవ గుణాలను తెలుసుకొని, పాటించాలి. ఆయన లీలలు విని, అనుసరించిన వారికి మోక్షం లభిస్తుందని పురాణాల వాక్కు.

News November 3, 2025

లోకేశ్వరం: మనస్పర్ధలతో యువతి.. బాధతో యువకుడు ఆత్మహత్య

image

నిర్మల్ జిల్లాలో మనస్పర్ధలతో యువతి.. బాధతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు.. లోకేశ్వరం(M) వట్టోలికి చెందిన అఖిలతో అదే గ్రామానికి చెందిన నరేశ్‌కు పరిచయముంది. కొన్ని రోజులుగా వీరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దీంతో యువతి పురుగు మందు తాగి సూసైడ్ చేసుకుంది. విషయం తెలుసుకున్న నరేశ్ గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని SI అశోక్ తెలిపారు.