News April 12, 2025

గుండెపోటుతో మొగుళ్లపల్లి ఎంపీడీఓ మృతి

image

ఎంపీడీఓగా విధులు నిర్వర్తిస్తున్న మహబూబ్ హుస్సేన్ గుండెపోటుతో మృతి చెందారు. పదిహేనేళ్లుగా జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించి ఇటీవల ఎంపీడీఓగా బాధ్యతలు తీసుకున్నారు. మేలో పదవీ విరమణ ఉండగా ఇలా జరగడం చాలా బాధాకరమని ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు విచారం వ్యక్తం చేశారు.

Similar News

News January 14, 2026

భూపాలపల్లి: ఆన్లైన్లో సకినాలు ఆర్డర్..!

image

ఇంట్లో అప్పాలు, పిండి వంటలు చేయలేక ఆన్లైన్లో ఆర్డర్లు పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు సంక్రాంతి వచ్చిందంటే పల్లెలతో పాటు పట్టణల్లో సందడిగా ఉండేది. సంక్రాంతి ముగ్గులతో పాటు సకినాలు ఫేమస్. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పని చేతకాకనో, బిజీలైఫ్ వల్లో మొత్తానికి ఒక్క సంక్రాంతి పండగే కాక అన్ని పండగలకు అప్పాలు, పిండి వంటలు, హోమ్ ఫుడ్ లేదా ఆన్లైన్ ద్వారా ఆర్డర్లు చేస్తున్నారు. ఈజీగా అప్పాలు తినేస్తున్నారు.

News January 14, 2026

ప్రధాని మెచ్చిన కాకినాడ యువకుడి ఐడియా

image

కాకినాడ జిల్లా కేఈ చిన్నయ్యపాలెం గ్రామానికి చెందిన యువకుడు కొరుప్రోలు శివ మణికంఠ జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు సాధించారు. ఈనెల 12న ఢిల్లీలో జరిగిన ‘వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్–2026’లో ఆయన పాల్గొని, వ్యవసాయ రంగంలో తనకున్న వినూత్న ఆలోచనలను ప్రధాని మోదీ సమక్షంలో ప్రదర్శించారు. శివ మణికంఠ టాప్-5 ఐడియా విభాగంలో నిలవడం విశేషం. ఈ యువకుడి ఘనతపై జిల్లా వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

News January 14, 2026

బుల్లెట్ బండిని గెలుచుకున్న గుంటూరు కోడి పుంజు

image

కృష్ణా జిల్లా బంటుమిల్లిలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన కోడిపందేలలో రాజధాని ప్రాంతం నుంచి తుళ్లూరుకి చెందిన కోడి పుంజు పందెంలో నెగ్గింది. దీంతో నిర్వాహకులు వారికి బుల్లెట్ బండిని బహుమతిగా అందజేశారు. బుల్లెట్ వాహనం ఖరీదు సుమారు రూ.2.50 లక్షల పైన ఉంటుందని చెబుతున్నారు. పందేలను వీక్షించేందుకు భారీగా జనం గుమిగూడారు.