News April 12, 2025
సళేశ్వరం జాతరలో పోలీసులకు సహకరించాలి: అచ్చంపేట డీఎస్పీ

అమ్రాబాద్ నల్లమల్ల ప్రాంతంలోని అటవీ ప్రాంతంలోని శ్రీ సళేశ్వరం లింగమయ్య స్వామి జాతరకు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే భక్తులు పోలీసు అధికారులకు సహకరించాలని అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాస్ కోరారు. శని, ఆదివారాలు సెలవు దినం కావడంతో భక్తులు వేలాదిగా తరలిరానున్నారన్నారు. భక్తులు స్వామివారి దర్శనం అనంతరం అక్కడ సేద తీరకుండా ఇతర భక్తులకు అవకాశం కల్పించేందుకు వెంటనే తిరుగు ప్రయాణం కావాలని సూచించారు.
Similar News
News March 3, 2026
పాలమూరు: రేపటి నుంచే ఓపెన్ యూనివర్సిటీ పరీక్షలు

డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ మొదటి సంవత్సరం సెమిస్టర్-1 పరీక్షలు మార్చి 4 నుంచి ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని కొల్లాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కో-ఆర్డినేటర్ ఉదయ్ కుమార్ సూచించారు.
News March 3, 2026
శ్రీరంగాపురం: గ్రహణం వేళ రంగనాథుని ఆలయం మూసివేత

చంద్రగ్రహణం కారణంగా దక్షిణ కాశీగా పేరొందిన శ్రీరంగనాయక స్వామి ఆలయ ద్వారాలను మంగళవారం మూసివేశారు. గ్రహణం ముగిశాక సంప్రోక్షణ, శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి, ప్రస్తుతం జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాలను యథావిధిగా ఘనంగా కొనసాగిస్తామని ఆలయ పూజారులు, అధికారులు వెల్లడించారు.
News March 3, 2026
డెంకాడ: జనగణన-2027 తొలి దశ శిక్షణ ప్రారంభం

జనగణన-2027 తొలి దశ ‘గృహాల జాబితా’ శిక్షణను జిల్లా జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ డెంకాడలోని చింతలవలస MVGR కాలేజీలో మంగళవారం ప్రారంభించారు. అధికారులు డిజిటల్ యాప్ ద్వారా ఖచ్చితమైన డేటా సేకరణ చేసి, ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. అధికారులు జనగణన డేటా సేకరణపై పూర్తి అవగాహన పెంచుకొని ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు.


