News April 12, 2025
MHBD: ఇందిరమ్మ ఇళ్ల విషయంలో గందరగోళం

ప్రభుత్వం పేదలకు ఇవ్వనున్న ఇందిరమ్మ ఇళ్ల విషయంలో పలు గ్రామాల్లో గందరగోళం నెలకొంది. అధికార కాంగ్రెస్ నాయకులు కమిటీలుగా ఏర్పడి అర్హుల జాబితాను దాదాపు సిద్ధం చేశారు. కాగా, కొన్ని లిస్టులు లీక్ అవ్వగా అందులో తమ పేరు లేదని తెలుసుకున్న కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమిటీ సభ్యులకు కావాల్సిన వారికి ఇళ్లు ఇవ్వాలని చూస్తున్నారని వాట్సప్ వేదికగా ఆరోపిస్తున్నారు.
Similar News
News January 13, 2026
BREAKING: యాదాద్రి: అక్రమాలపై పోలీసులకు ఫిర్యాదు

భూరిజిస్ట్రేషన్ల ఛార్జీల చెల్లింపుల్లో అక్రమాలపై యాదగిరిగుట్ట, తుర్కపల్లి, బొమ్మలరామారం, వలిగొండ PSలలో తహశీల్దార్లు ఈరోజు ఫిర్యాదు చేశారు. తహశీల్దార్ల ఫిర్యాదు మేరకు 4 PSలల్లో ఇంటర్నెట్ సెంటర్ల నిర్వాహకులు, డాక్యుమెంట్ రైటర్లు 19 మందిపై కేసులు నమోదు చేశారు. వలిగొండ రూ.15 లక్షలు యాదగిరిగుట్ట రూ.72 లక్షలు, బొమ్మలరామారంలో రూ.25 లక్షలు, తుర్కపల్లిలో రూ.14 లక్షలు ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారన్నారు.
News January 13, 2026
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

✓ చైనా మాంజా వాడొద్దు: మణుగూరు DSP
✓ చుంచుపల్లి: పాఠశాల వద్ద హైటెన్షన్ ముప్పు
✓ సుజాతనగర్: ట్రాఫిక్ నియమాలు పాటించాలి: ఎస్పీ
✓ అశ్వారావుపేటలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన
✓ ఈనెల 16, 17న పాల్వంచ పెద్దమ్మ గుడిలో ప్రత్యేక పూజలు
✓ దుమ్ముగూడెం: హెల్త్ సెంటర్లను తనిఖీ చేసిన DMHO
✓ కొత్తగూడెం: లిక్విడ్ గంజాయి తరలిస్తున్న వ్యక్తులు అరెస్ట్
✓ దుమ్ముగూడెం: విద్యుత్ షాక్తో వర్కర్కు గాయాలు
News January 13, 2026
NGKL: బాధ్యతగా ట్రాఫిక్ నియమాలు పాటించాలి: ఎస్పీ

నాగర్కర్నూల్ జిల్లాలోని రోడ్డు నిబంధనలను భయం కోసం కాకుండా బాధ్యతతో పాటించాలని జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ సూచించారు. మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వేగం కన్నా ప్రాణం ముఖ్యమని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ తమ కుటుంబాలకు భద్రతగా ఉండాలని కోరారు.


