News April 12, 2025

కొండగట్టు: జయంతి ఉత్సవాల్లో మహిళా పోలీసులు

image

చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టులో భక్తుల సౌకర్యార్థం కట్టుదిట్టమైన పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. దాదాపు 800 మంది పోలీసుల పర్యవేక్షణలో ఉత్సవాలు సజావుగా సాగుతున్నాయి. మహిళా పోలీసులు ఉత్సాహంగా పాల్గొని బందోబస్త్ నిర్వహిస్తున్నారు. అలాగే డాగ్ స్క్వాడ్‌తో నిత్యం పర్యవేక్షిస్తున్నారు. కొండగట్టుకు తరలివస్తున్న హనుమాన్ దీక్షాపరులకు పోలీసులు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News November 6, 2025

’FATHI’ ఆరోపణలు అవాస్తవం: ఐఏఎస్‌లు

image

TG: విద్యాశాఖ ఇన్‌ఛార్జి కార్యదర్శి దేవసేనపై ప్రయివేటు కాలేజీల సంఘం(FATHI) <<18207242>>ఆరోపణలు<<>> నిరాధారం, అవాస్తవమని IASల అసోసియేషన్ ఖండించింది. ఫతి ఆరోపణలు ఆమెను తక్కువ చేసేవే కాకుండా సివిల్ సర్వీసెస్ నైతికతను సమగ్రతను దెబ్బతీసేవిగా ఉన్నాయని పేర్కొంది. ఆరోపణలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. విధుల్లో అనేక సవాళ్లు ఎదుర్కొంటూ అంకిత భావంతో పనిచేసే అధికారులపై ఆరోపణలు తగవని హితవు పలికింది.

News November 6, 2025

వరి ధాన్యానికి కనీస మద్దతు ధర చెల్లించాలి: జేసీ

image

వరి ధాన్యానికి కనీస మద్దతు ధర చెల్లింపులో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను జేసీ కొల్లాబత్తుల కార్తీక్ ఆదేశించారు. గురువారం జేసీ ఛాంబర్‌లో ధాన్యం కొనుగోలు కార్యకలాపాలపై సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వరి కోతలకు అనుగుణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. గ్రేడ్-A రకం వరికి క్వింటా రూ.2,389, కామన్ రకం వరికి రూ.2,369 చెల్లించాలని అధికారులకు సూచించారు.

News November 6, 2025

రేపు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు రాక

image

మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నెల్లూరుకు చేరుకుంటారు. రాత్రి 7 గంటలకు నెల్లూరు VRC మైదానంలో నిర్వహిస్తున్న కార్తీక లక్ష దీపోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొంటారు. ఈనెల 8వ తేదీ శనివారం ఉదయం 11 గంటలకు డీఆర్సీ సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 4.15 గంటలకు కొండ బిట్రగుంటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని మంత్రి దర్శించుకుంటారు.