News April 12, 2025
మహిళలతో అమర్యాదగా ప్రవర్తిస్తే కేసులే: ఎస్పీ

సోషల్ మీడియా మాధ్యమాలలో ఇతరుల వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఏఅర్.దామోదర్ శనివారం హెచ్చరించారు. మహిళలపై ఫోన్లలో, సోషల్ మీడియా మాధ్యమాలలో అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడినా, పోస్టులు పెట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళలతో అమర్యాదగా ప్రవర్తిస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్పీ పేర్కొన్నారు.
Similar News
News March 22, 2026
ప్రకాశం: ‘నేడు కూడా కరెంట్ బిల్లులు చెల్లించవచ్చు’

ప్రకాశం జిల్లాలో ఆదివారం కూడా విద్యుత్ బిల్లు కౌంటర్లు తెరిచి ఉంటాయని SE కట్టా వెంకటేశ్వర్లు తెలిపారు. వినియోగదారుల సౌకర్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. జిల్లాలోని అన్ని కౌంటర్లు పనిచేస్తాయని వెల్లడించారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. నిర్ణీత సమయంలో బిల్లు చెల్లించడం వలన పెనాల్టీ పడదని అన్నారు. ఆన్లైన్లో కూడా బిల్లులు చెల్లించవచ్చని చెప్పారు.
News March 22, 2026
గంజాయి నిందితులకు ఒంగోలులో కౌన్సెలింగ్

మత్తు పదార్థాల నియంత్రణలో భాగంగా ఒంగోలులో గతంలో గంజాయి కేసుల్లో ఉన్న నిందితులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సుధాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గంజాయి వల్ల కలిగే చట్టపరమైన ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించారు. మత్తు పదార్థాల విక్రయం, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే 112కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
News March 22, 2026
గంజాయి నిందితులకు ఒంగోలులో కౌన్సెలింగ్

మత్తు పదార్థాల నియంత్రణలో భాగంగా ఒంగోలులో గతంలో గంజాయి కేసుల్లో ఉన్న నిందితులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సుధాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గంజాయి వల్ల కలిగే చట్టపరమైన ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించారు. మత్తు పదార్థాల విక్రయం, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే 112కు ఫిర్యాదు చేయాలని సూచించారు.


