News March 27, 2024
నిర్మల్: అతిగా మద్యం తాగి పర్మిట్ రూంలోనే మృతి
అతిగా మద్యం తాగిన వ్యక్తి వైన్స్ పర్మిట్ రూంలోనే మృతి చెందిన ఘటన లోకేశ్వరంలో మంగళవారం జరిగింది. SI రాజు వివరాలు.. లోకేశ్వరానికి చెందిన ప్రశాంత్ కొన్నాళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. మంగళవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ప్రశాంత్.. సాయంత్రం కొత్త బస్టాండ్ వద్ద ఉన్న వైన్స్ పర్మిట్ రూంలో అతిగా మద్యం తాగి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేశారు.
Similar News
News September 29, 2024
ASF: రేపు జోనల్ స్థాయి హ్యాండ్ బాల్ పోటీలు
ఆసిఫాబాద్లోని గిరిజన ఆదర్శ బాలికల క్రీడా పాఠశాలలో సోమవారం SGFజోనల్ స్థాయి అండర్-17 బాలబాలికల హ్యాండ్ బాల్ పోటీలు నిర్వహించనున్నట్లు DEOయాదయ్య, SGF జిల్లా సెక్రటరీ సాంబశివరావు తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి జిల్లా క్రీడాకారులు ఎంట్రీ ఫామ్లతో ఉదయం 9గంటలకు హాజరుకావాలన్నారు. వివరాలకు TW క్రీడల అధికారి మీనారెడ్డి, కోచ్ అరవింద్ను సంప్రదించాలని సూచించారు.
News September 29, 2024
బాసర: నవరాత్రుల ఉత్సవాల్లో ఈ సేవలు రద్దు
బాసర అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రుల ఉత్సవాల్లో పలు సేవలు రద్దు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అక్టోబర్ 3 నుంచి 11వరకు అభిషేకాలు, 9న అక్షరాభ్యాసం తప్ప మిగతా ఆర్జిత సేవలు రద్దు, 11 నుంచి 13 చండీహోమం, 12న ఉదయం 10 గం.ల వరకు అక్షరాభ్యాసములు రద్దు చేసినట్లు వెల్లడించారు. భక్తులు గమనించి సహకరించాలని కోరారు.
News September 29, 2024
ADB: దసరా స్పెషల్.. RTC ఆధ్వర్యంలో 412 ప్రత్యేక బస్సులు
దసరా సెలవుల నేపథ్యంలో ఆదిలాబాద్ రిజియన్లోని వివిధ డిపోల నుంచి 412 ప్రత్యేక బస్సులను JBS నుంచి ప్రత్యేకంగా నడుపుతున్నట్లు ఆదిలాబాద్ RTC RM సొలొమాన్ పేర్కొన్నారు. Oct 1 నుంచి 11 వరకు ఆదిలాబాద్ డిపో-78, అసిఫాబాద్-73, బైంసా-11, మంచిర్యాల-125, నిర్మల్-120, ఉట్నూర్-5 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రత్యేక బస్సులు OCT 1 నుంచి OCT 11 వరకు నడుస్తాయని పేర్కొన్నారు.