News April 12, 2025
ప్రకృతి తల్లి ఒడిలో వనజీవి (PHOTO OF THE DAY)

KMM: ప్రకృతి ప్రేమికుడిగా పేరుగాంచిన పద్మశ్రీ వనజీవి రామయ్య తుది శ్వాస విడిచారు. కాగా వనజీవి రామయ్యను ప్రకృతి తల్లి.. తన ఒడిలో చేర్చుకుంటున్న ఫొటో ఇప్పుడు వైరల్ అవుతుంది. కోటికి పైగా మొక్కలు నాటి అలసిపోయిన తన బిడ్డను తల్లి అక్కున చేర్చుకునే విధంగా ఉన్న ఈ ఫొటో.. ప్రతి ఒక్కరిని కలిచివేస్తుంది. రామయ్య సాధారణ వ్యక్తిగా జన్మించి ప్రకృతి ప్రేమికుడిగా చరిత్రలో నిలిచారు.
Similar News
News April 19, 2025
ఆదోని మెడికల్ కాలేజీపై ఆరోగ్యశాఖ మంత్రి స్పందన

కర్నూలు జీజీహెచ్లో అవసరమైన ఐపీ బ్లాక్ నిర్మిస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వైద్యులు, సిబ్బందితో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. నిర్మాణ దశలో ఉన్న క్రిటికల్ కేర్ బ్లాక్ను త్వరలోనే పూర్తిచేసి అందుబాటులోకి తెస్తామన్నారు. ఆదోని మెడికల్ కాలేజీని అన్ని వసతులతో వచ్చే ఏడాది అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు.
News April 19, 2025
కలెక్టర్& SPలతో సమావేశమైన మంత్రి భరత్

అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి టీజీ భరత్ను జిల్లా కలెక్టర్ వినోద్, ఎస్పీ జగదీశ్ శుక్రవారం కలిశారు. స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో మంత్రి భరత్ గంటపాటు సమీక్షించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి మంత్రి కలెక్టర్ను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్, ఎస్పీల పర్యవేక్షణలో జిల్లా ప్రభుత్వ అధికారుల పనితీరు బాగుందని మంత్రి కొనియాడారు.
News April 19, 2025
కామారెడ్డి: ఏపీ మంత్రిని కలిసిన ప్రభుత్వ సలహాదారు

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ శనివారం హైదరాబాద్లోని హాజ్ హౌస్లో ఆంధ్రప్రదేశ్ మైనార్టీ వెల్ఫేర్ శాఖ మంత్రి ఫరూక్ను మర్యాదపూర్వకంగా కలిశారు. హజ్ యాత్రకు వెళ్లే ఇరు రాష్ట్రాల యాత్రికులకు కల్పించాల్సిన సౌకర్యాలపై ఇరువురు చర్చించారు. అంతకుముందు మంత్రిని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ శాలువా కప్పి సత్కరించారు.