News April 12, 2025

ఢిల్లీ పార్టీలతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదు:BRS

image

వరంగల్‌లో ఈ నెల 27న జరగనున్న బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పిలుపునిచ్చారు. శనివారం క్యాతనపల్లి మున్సిపాలిటీలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ రజజోత్సవ సభతో దేశం చూపు తెలంగాణ వైపు పడుతుందని.. ఢిల్లీ పార్టీలతో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని, బీఆర్‌ఎస్‌ పదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధి కేసిఆర్‌ దూరదృష్టికి నిదర్శనమన్నారు.

Similar News

News April 13, 2025

బుగ్గనకు వైఎస్ జగన్ కీలక పదవి!

image

వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలకు చోటు దక్కింది. మాజీ మంత్రి బుగ్గల రాజేంద్రనాథ్ రెడ్డి, కర్నూలు మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ హఫీజ్ ఖాన్‌కు ఆ కమిటీలో చోటు కల్పిస్తూ వైసీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. సజ్జల రామకృష్ణారెడ్డి కన్వీనర్‌గా మొత్తం 33 మందితో ఈ కమిటీని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఏర్పాటు చేశారు. కమిటీలోని సభ్యులు జగన్‌కు రాజకీయ సలహాలు ఇవ్వనున్నారు.

News April 13, 2025

నిజామాబాద్ జిల్లాలో మాచర్ల వాసుల మృతి 

image

మాచర్లకి చెందిన షేక్ షాదుల్లా, ఆయన బావమరిది మహమ్మద్ రఫీక్‌లు నిజామాబాద్‌లో మృతిచెందారు. నందిపేట పరిధి సిద్దాపూర్ శివారులోని వాగులో చేపలు పట్టేందుకు వెళ్లారు. షేక్ రఫీక్ కాలుజారి ప్రమాదవశాత్తు వాగులో పడ్డాడు. అతనిని రక్షించేందుకు షాదుల్లా వాగులో దిగాడు. ఈ క్రమంలో ఇద్దరూ నీటిలో మునిగి ఊపిరాడక కన్నుమూశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు మృతదేహాలను వెలికి తీసి దర్యాప్తు చేస్తున్నారు. 

News April 13, 2025

వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో బాపట్ల మాజీ ఎంపీ, ఎమ్మెల్యే

image

వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో 33 మందితో సభ్యులను నియమిస్తూ వైసీపీ కేంద్ర కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో బాపట్ల మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి, మాజీ ఎంపీ నందిగామ సురేశ్‌లను సభ్యులుగా నియమించింది. బాపట్లకు చెందిన ఇద్దరు మాజీలకు కమిటీలో స్థానం లభించడంతో వైసీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

error: Content is protected !!