News April 12, 2025

అంబేద్కర్ జయంతిని విజయవంతం చేయండి: కలెక్టర్

image

ఈ నెల 14వ తేదీన భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని జిల్లాలో ఘనంగా నిర్వహించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పిలుపునిచ్చారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి సభ గోడపత్రికలను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య,అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, తదితరులు ఆవిష్కరించారు.

Similar News

News April 13, 2025

వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టులో విజయ్ పిటిషన్

image

వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తమిళ సినీ నటుడు, TVK పార్టీ అధినేత విజయ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ చట్టం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం అని, దీనిని వెనక్కి తీసుకోవాలని ఆయన ఇప్పటికే డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ చట్టానికి రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ ఇప్పటివరకు సుప్రీంకోర్టులో 10 పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై ఈనెల 16న ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

News April 13, 2025

క్షమాపణలు చెప్పను: రాకేశ్ రెడ్డి

image

TGPSC తనకు పరువునష్టం నోటీసులు <<16075233>>పంపడంపై <<>>BRS నేత రాకేశ్ రెడ్డి స్పందించారు. ‘పూర్తి ఆధారాలతో గ్రూప్-1 అవకతవకలు బయటపెట్టాం. వాటికి TGPSC సమాధానం చెప్పట్లేదు. కమిషన్ ఇలా పరువునష్టం నోటీసులు ఇవ్వడం దేశంలోనే ప్రథమం. నోటీసులు ఇచ్చినా నేను క్షమాపణలు చెప్పను. న్యాయవిచారణ జరిపిస్తే ఆధారాలు చూపిస్తాం. నేనే TGPSCపై పరువునష్టం దావా వేయబోతున్నా. అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం’ అని స్పష్టం చేశారు.

News April 13, 2025

క్షిపణి దాడిలో 31 మంది మృతి

image

ఉక్రెయిన్‌లోని సుమీ నగరంపై రష్యా సైన్యం బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 31 మంది మరణించినట్లు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ వెల్లడించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారని, 84 మందికి పైగా గాయపడ్డారని తెలిపారు. ప్రపంచ దేశాలు మౌనంగా ఉండకుండా రష్యా దాడులను ఖండించాలని ఆయన కోరారు. రష్యాపై బలమైన ఒత్తిడి తీసుకురాకపోతే ఈ యుద్ధాన్ని ఇలాగే కొనసాగిస్తుందని అన్నారు.

error: Content is protected !!