News April 12, 2025
ఎల్లుండి నుంచి ‘భూ భారతి’ అమలు

TG: భూ భారతి చట్టాన్ని ఈనెల 14 నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో ఎంపిక చేసిన 3 మండలాల్లో అమల్లోకి తేనుంది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించనున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. భూ భారతి పోర్టల్ను మరింత బలోపేతం చేస్తామన్నారు. ఈ పోర్టల్పై ప్రతి మండలంలో కలెక్టర్ల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News April 14, 2025
TODAY HEADLINES

☞ AP: అనకాపల్లి జిల్లాలో అగ్నిప్రమాదం.. 8 మంది మృతి
☞ శ్రీవారికి తలనీలాలు సమర్పించిన పవన్ కళ్యాణ్ భార్య
☞ TG: పారదర్శకంగా ‘భూ భారతి’ : CM రేవంత్
☞ TG: సన్నబియ్యంలో 40 శాతం నూకలే: హరీశ్ రావు
☞ తెలుగు రాష్ట్రాల్లో వడగళ్ల వర్షం
☞ IPL: RRపై RCB, DCపై MI విజయం
News April 14, 2025
అశ్వవాహనంపై కోదండరాముడు

AP: కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా ఇవాళ రాత్రి అశ్వవాహనంపై దర్శనమిచ్చారు. అంతకుముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో అలరించారు. అశ్వవాహనంపై స్వామిని చూస్తూ భక్తులు శ్రీరామనామ స్మరణలతో పరవశించిపోయారు.
News April 14, 2025
రాజధాని కోసం మరోసారి భూ సమీకరణ?

AP: రాజధాని అమరావతి పునర్నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రాజధాని కోసం మరో 30 వేల ఎకరాలకు పైగా భూమిని సేకరించాలని యోచిస్తున్నట్లు సమాచారం. గతంలోనే 29 గ్రామాల్లోని 33,000 ఎకరాల భూమిని ప్రభుత్వం రైతుల నుంచి సమీకరించింది. ఇప్పుడు తూళ్లురు, అమరావతి, తాడికొండ, మంగళగిరిలో ఈ భూ సేకరణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది.