News April 13, 2025

రాష్ట్రంలో మరింత మండిపోనున్న ఎండలు

image

తెలంగాణలో ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇవాళ అత్యధికంగా మంచిర్యాల జిల్లాలో 43.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అన్ని జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు దాదాపు 40-44 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఏప్రిల్ 18 నుంచి వడగాలులు మరింత తీవ్రంగా ఉండే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అయితే, ఏప్రిల్ 15-17 మధ్య మాత్రం కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు.

Similar News

News April 14, 2025

2021-24 మధ్య గోశాలలో అక్రమాలు: TTD EO

image

AP: తిరుమలలోని గోశాల నిర్వహణలో మార్చి 2021 నుంచి మార్చి 2024 వరకు ఎన్నో అక్రమాలు జరిగాయని టీటీడీ ఈవో శ్యామలారావు ఆరోపించారు. గత ఐదేళ్లలో చనిపోయిన ఆవుల వివరాలను దాచిపెట్టారన్నారు. ఆవులు లేని గోశాలకు దాణా పేరుతో నిధులు దుర్వినియోగం చేశారని చెప్పారు. అలాగే స్వామివారికి ఆర్గానిక్ ప్రసాదాల పేరుతో అక్రమాలు చోటుచేసుకున్నాయని వివరించారు. రూ.3 కోట్ల విలువైన సరకులకు రూ.25 కోట్లు చెల్లించారని పేర్కొన్నారు.

News April 14, 2025

ఉక్రెయిన్‌కు రండి.. ట్రంప్‌కు జెలెన్‌స్కీ ఆహ్వానం

image

US అధ్యక్షుడు ట్రంప్ ఉక్రెయిన్ సందర్శించాలని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కోరారు. రష్యా తమ దేశంలో చేసిన విధ్వంసం చూడాలన్నారు. యుద్ధంతో తమ దేశంలో నెలకొన్న పరిస్థితులు, మరణించిన, గాయపడిన ప్రజలు, దెబ్బతిన్న కట్టడాల్ని చూసిన అనంతరం ఏదైనా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా ఫిబ్రవరిలో ట్రంప్, జెలెన్‌స్కీ మధ్య జరిగిన చర్చలు వాగ్వాదంతో అర్ధాంతరంగా ముగిశాయి.

News April 14, 2025

సంచలనం.. దంతాలు ఎప్పుడు ఊడినా వృద్ధి చేయొచ్చు

image

పిల్లల్లో పాలదంతాలు ఊడిపోయి కొత్తవి వస్తాయి. వాటిని కోల్పోతే మళ్లీ రావు. తాజాగా ప్రపంచంలోనే తొలిసారి UK సైంటిస్టులు ల్యాబ్‌లో మానవ దంతాలను సృష్టించారు. దంతాల వృద్ధికి అవసరమైన వాతావరణాన్ని కల్పించే ఓ పదార్థాన్ని అభివృద్ధి చేశారు. భవిష్యత్తులో రోగులు కోల్పోయిన దంతాలను వారిలోనే వృద్ధి చేయొచ్చంటున్నారు. ఫిల్లింగ్స్, ఇంప్లాంట్స్‌ అవసరం ఉండదని, దంత రక్షణలో ఇదో విప్లవాత్మక పురోగతి అని చెబుతున్నారు.

error: Content is protected !!