News April 13, 2025
ADB: FREE TRAINING& JOBS

ఆదిలాబాద్ బీసీ సంక్షేమ శాఖ, బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో బ్యాంకింగ్& ఫైనాన్స్లో ఉచిత శిక్షణ కోసం ఆన్లైన్ ఎగ్జామ్ను ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 104 మంది APPLY చేయగా శనివారం 50 మంది ఎగ్జామ్ రాశారు. ఈ నెల 15న ఫలితాలు ప్రకటించనున్నారు. త్వరలో HYDలో ఉచిత శిక్షణ, ఉద్యోగ కల్పన చేస్తామని బీసీ సంక్షేమ అధికారి రాజలింగు తెలిపారు.
Similar News
News February 1, 2026
కేంద్రానికి ఆదాయం ఎలా వస్తుందంటే.. 1/2

కేంద్ర ప్రభుత్వానికి వివిధ మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. 2025 బడ్జెట్ అంచనాల ప్రకారం ప్రతి రూపాయిలో 39 పైసలు ప్రత్యక్ష పన్నుల(వ్యక్తులు-22 పైసలు, కార్పొరేట్ ట్యాక్స్-17 పైసలు) రూపంలో వస్తాయి. జీఎస్టీ-18 పైసలు, ఎక్సైజ్ డ్యూటీ-5 పైసలు, కస్టమ్స్ డ్యూటీ-4 పైసలు, రుణాలు, ఇతర అప్పుల ద్వారా-24 పైసలు, పన్నేతర ఆదాయం-9 పైసలు, నాన్ డెబిట్ క్యాపిటల్ రిసీప్ట్స్ ద్వారా-1 పైసా వస్తుంది.
News February 1, 2026
ప్రతి రూపాయి ఖర్చు ఇలా.. 2/2

కేంద్రానికి వచ్చే ఆదాయంలో ఎక్కువ షేర్ రాష్ట్రాలకు అందుతుంది. ట్యాక్స్, డ్యూటీస్ వాటా కింద ప్రతి రూపాయిలో 22 పైసలు వెళ్తుంది. వడ్డీ చెల్లింపులకు 20 పైసలు, కేంద్ర రంగ పథకాలకు 16 పైసలు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు 8 పైసలు వెళ్తాయి. డిఫెన్స్ సెక్టార్కు 8 పైసలు, ఫైనాన్స్ కమిషన్కు 8 పైసలు, సబ్సిడీలకు 6 పైసలు, పెన్షన్లకు 4 పైసలు ఖర్చు చేస్తారు. 8 పైసలను పాలన, ప్రభుత్వ వ్యయాల వంటి వాటికి ఉపయోగిస్తారు.
News February 1, 2026
ఎన్నికల విధులపై అధికారులకు రేపు శిక్షణ: కలెక్టర్

సంగారెడ్డి జిల్లాలో ఈనెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల విధుల కోసం నియమించిన ప్రిసైడింగ్, సహ-ప్రిసైడింగ్ అధికారులకు రేపు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. మొత్తం 1,298 మంది అధికారులకు ఎన్నికల నిబంధనలు, విధులపై అవగాహన కల్పిస్తామన్నారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.


