News April 13, 2025

శ్రీ సత్యసాయి: ఆలయ భూకబ్జాపై EO సీరియస్

image

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలలోని గుడిపల్లి సజ్జ గంటి రంగనాథస్వామి ఆలయ భూమిని సర్పంచ్ కబ్జా చేసేందుకు ప్రయత్నం చేశారు. దీనిని గమనించిన గ్రామస్థులు శనివారం కబ్జాను అడ్డుకున్నారు. సర్వే ప్రకారం గ్రామస్థులు ఆ భూమికి చుట్టూ రాళ్లు పాతారు. సర్పంచ్ రాత్రి ఆ రాళ్ళను తొలగించారు. విషయం తెలుసుకున్న EO ఈశ్వర్ దేవాలయ భూమిని పరిశీలించి, బోర్డును వేసి ఈ భూమిలోకి ఎవరైనా వస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

Similar News

News April 18, 2026

VJA: ఇద్దరు పిల్లలకు ఉరివేసి తల్లి ఆత్మహత్య (UPDATE)

image

విజయవాడ శివారు పైడూరుపాడులో శుక్రవారం రాత్రి కవిత అనే మహిళ తన ఇద్దరు పిల్లలకు ఉరివేసి, తాను కూడా ఆత్మహత్య చేసుకున్న <<19678151>>విషయం తెలిసిందే. <<>>సమాచారం తెలుసుకున్న ఇబ్రహీంపట్నం సీఐ సుబ్రహ్మణ్యం ఘటనా స్థలానికి చేరుకొని మృతికి గల వివరాలు సేకరిస్తున్నారు. కాగా కవిత గత 5 సంవత్సరాలుగా వింతగా ప్రవర్తిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.

News April 18, 2026

బాపట్ల జిల్లాలో నలుగురు ఎస్ఐల బదిలీలు

image

బాపట్ల జిల్లాలో నలుగురు ఎస్ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ ఉమా మహేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. నిజాంపట్నం ఎస్ఐగా పని చేస్తున్న తిరుపతిరావు‌ను చెరుకుపల్లికి, జిల్లా వీఆర్‌లో ఉన్న కిరణ్ బాబును నిజాంపట్నానికి, బాపట్ల పీసీఆర్ ఎస్సైగా పనిచేస్తున్న బాబురావును మార్టూరు పోలీస్ స్టేషన్‌కు, చెరుకుపల్లి ఎస్సై అనిల్ కుమార్‌ను జిల్లా వీఆర్‌కు బదిలీ చేశారు.

News April 18, 2026

చిత్తూరు: ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎండలు

image

చిత్తూరు జిల్లాలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం 6 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. గంగవరంలో 41.2, రొంపిచెర్లలో 41.1, శ్రీరంగరాజపురంలో 40.1, తవణంపల్లెలో 40.9, విజయపురంలో 40.5, బంగారుపాళ్యంలో 40.0, నగరి, నిండ్రలో 39.8, పులిచెర్ల, శాంతిపురంలో 39.6 డిగ్రీల టెంపరేచర్ నమోదు అయ్యింది.