News April 13, 2025

శ్రీ సత్యసాయి: ఆలయ భూకబ్జాపై EO సీరియస్

image

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలలోని గుడిపల్లి సజ్జ గంటి రంగనాథస్వామి ఆలయ భూమిని సర్పంచ్ కబ్జా చేసేందుకు ప్రయత్నం చేశారు. దీనిని గమనించిన గ్రామస్థులు శనివారం కబ్జాను అడ్డుకున్నారు. సర్వే ప్రకారం గ్రామస్థులు ఆ భూమికి చుట్టూ రాళ్లు పాతారు. సర్పంచ్ రాత్రి ఆ రాళ్ళను తొలగించారు. విషయం తెలుసుకున్న EO ఈశ్వర్ దేవాలయ భూమిని పరిశీలించి, బోర్డును వేసి ఈ భూమిలోకి ఎవరైనా వస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

Similar News

News September 17, 2025

నమో డ్రోన్ దీదీ పథకం గురించి తెలుసా?

image

మహిళా సాధికారత కోసం కేంద్రం పలు పథకాలు ప్రవేశపెట్టింది. అందులో ఒకటే <>నమో డ్రోన్ దీదీ.<<>> మహిళా స్వయం సహాయ సంఘాల్లోని సభ్యులకు డ్రోన్ టెక్నాలజీని పరిచయం చేయడమే ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం. మహిళా సంఘాలకు డ్రోన్లు కొనుగోలు చేసుకునేందుకు 80 శాతం సబ్సిడీతో లోన్స్ ఇస్తోంది కేంద్రం. గరిష్ఠంగా రూ.8 లక్షల వరకు రాయితీ పొందవచ్చు. డ్రోన్ కోసం కావాల్సిన మిగతా డబ్బులను 3 శాతం నామ మాత్రపు వడ్డీ రేటుతో రుణం ఇస్తోంది.

News September 17, 2025

ADB: గండర గండడు కొమురం భీముడే మన బిడ్డ..!

image

తెలంగాణ చరిత్రలో వీరత్వానికి, పోరాటానికి ప్రతీకగా నిలిచారు కొమురం భీమ్. 1901లో జన్మించిన ఈ గిరిజన యోధుడు నిజాం పాలనకు వ్యతిరేకంగా ఆదివాసీల హక్కుల కోసం పోరాడారు. ‘జల్, జంగల్, జమీన్’ అనే నినాదంతో గిరిజనులను ఏకం చేసి తమ వనరులపై ఉన్న హక్కులను నిలబెట్టుకోవాలని పిలుపునిచ్చారు. ​1940లో జోడేఘాట్ వద్ద నిజాం పోలీసులతో జరిగిన పోరాటంలో కొమురం భీమ్ అమరుడయ్యారు. ఆయన ధైర్యం, పోరాట స్ఫూర్తి నేటికీ ఆదర్శం.

News September 17, 2025

పాకిస్థాన్ మ్యాచులకు రిఫరీగా రిచర్డ్‌సన్!

image

ఆసియా కప్: షేక్‌హ్యాండ్ వివాదంలో రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ని తొలగించాలని పాకిస్థాన్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఆయన్ను ఆసియా కప్ నుంచి తొలగించకపోతే తాము UAEతో మ్యాచ్ ఆడబోమని ప్రకటించింది. ఈ నేపథ్యంలో పాక్ మ్యాచులకు పైక్రాఫ్ట్‌ను ICC దూరం పెట్టినట్లు తెలుస్తోంది. UAEతో మ్యాచ్‌కు రిఫరీగా రిచర్డ్‌సన్‌ను నియమించినట్లు PCB సభ్యుడు చెప్పారని PTI కథనం ప్రచురించింది.