News April 13, 2025
కీవ్లోని భారతదేశ ఫార్మా గౌడౌన్పై రష్యా దాడులు: ఉక్రెయిన్

తమ దేశంలోని కీవ్లో ఉన్న భారత్కు చెందిన ఓ ఫార్మా గోడౌన్పై రష్యా క్షిపణి దాడి చేసిందని ఉక్రెయిన్ ఆరోపించింది. భారత్తో మైత్రి ఉందని చెబుతూనే ఉద్దేశపూర్వకంగా ఆ దేశ వ్యాపారాలను మాస్కో టార్గెట్ చేస్తోందని INDలోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం పేర్కొంది. ఈ దాడితో పిల్లలు, వృద్ధుల కోసం ఉద్దేశించిన మందులు నాశనం అయినట్లు వివరించింది. కాగా, ఉక్రెయిన్ ఆరోపణలపై భారత్, రష్యా ప్రభుత్వాలు ఇంకా స్పందించలేదు.
Similar News
News April 15, 2025
SC వర్గీకరణపై 5 రోజుల్లో ఆర్డినెన్స్.. ఆ వెంటనే DSC?

AP: జాతీయ SC కమిషన్ నుంచి వర్గీకరణ డాక్యుమెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. దీనిపై ఇవాళ మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. 5 రోజుల్లో ఆర్డినెన్స్ విడుదల చేసి, ఆ తర్వాత 3 రోజుల్లో మార్గదర్శకాలను వెల్లడించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే వారంలో విద్యాశాఖ మెగా DSC నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశముంది. జూన్ నాటికి 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని CM CBN ప్రకటించిన విషయం తెలిసిందే.
News April 15, 2025
త్రివిక్రమ్తో వెంకటేశ్ మూవీ ఫిక్స్?

వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ మూవీ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ డ్రామా సబ్జెక్ట్తో తెరకెక్కబోయే ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుందని సమాచారం. కాగా అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ అట్లీ ప్రాజెక్ట్ వల్ల ఈ సినిమా ఆగిపోయింది. అట్లీ-బన్నీ మూవీ పూర్తయ్యేందుకు దాదాపు ఏడాదికిపైగా పడుతుంది. ఈ గ్యాప్లో వెంకీతో త్రివిక్రమ్ సినిమా కంప్లీట్ చేసే ఛాన్సుంది.
News April 15, 2025
Intermediate: సంస్కృతంతో తెలుగుకు దెబ్బేనా?

TG: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సంస్కృతాన్ని రెండోభాషగా ప్రవేశపెట్టాలన్న ఇంటర్మీడియట్ అధికారుల నిర్ణయం వివాదాస్పదం అవుతోంది. ఇప్పటికే కార్పొరేట్ కాలేజీల్లో 90% మంది విద్యార్థులు ఎక్కువ మార్కులు వస్తాయని సంస్కృతాన్ని ఎంచుకుంటున్నారు. టెన్త్ వరకు తెలుగు చదివిన విద్యార్థులు ఇంటర్లో సంస్కృతాన్ని తీసుకుంటే తెలుగు భాషకు తీవ్ర నష్టం జరుగుతుందని విశ్లేషకులు ఆవేదన చెందుతున్నారు. దీనిపై మీ కామెంట్?