News April 13, 2025
కన్నెపల్లి: ప్రభుత్వ భూమి కబ్జా.. ఏడుగురి అరెస్ట్

కన్నెపల్లి మండలం రెబ్బల గ్రామ శివారులో S.No248 లోని ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు SI గంగారం తెలిపారు. మండల తహశీల్దార్ ఫిర్యాదు మేరకు చేసిన విచారణలో ఎలాంటి అనుమతులు లేకుండా ప్రవేశించి ఆ భూమిలో చెట్లను నరికివేశారన్నారు. దీంతో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు.
Similar News
News April 15, 2025
SRPT: పొలంలో బయటపడ్డ పురాతన శివలింగం

సూర్యాపేట జిల్లాలో పొలం చదును చేస్తుండగా పురాతన శివలింగం బయటపడింది. చివ్వెంల మండలం తిమ్మాపురంలో రణబోతు బాధిరెడ్డి తన వ్యవసాయ భూమిలో జేసీబీతో చదును చేయిస్తుండగా పురాతన శివలింగంతో పాటు నాగపడిగ విగ్రహాలు జేసీబీకి తగలడంతో వాటిని జాగ్రత్తగా తీసి పక్కకు పెట్టి శుభ్రం చేశారు. తిమ్మాపురంతో పాటు, మోదీన్పురం పరిసర గ్రామాల నుంచి శివభక్తులు అక్కడకు చేరుకుని క్షీరాభిషేకం చేసి పూజలు నిర్వహించారు.
News April 15, 2025
తెనాలి: కుమార్తెపై తండ్రి లైంగిక దాడికి యత్నం

గుంటూరు (D) తెనాలి మండలం గుడివాడలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. SI ఆనంద్ తెలిపిన వివరాల మేరకు.. 40 ఏళ్ల వ్యక్తికి 15 సంవత్సరాల క్రితం వివాహమై, ఇద్దరు కుమార్తెలు జన్మించారు. ఆదివారం తెల్లవారు జామున ఓ కుమార్తెపై లైంగిక దాడికి యత్నించాడు. గమనించిన భార్య వెంటనే కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. భార్య ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో, BNS చట్టం కింద కేసులు నమోదు చేశారు.
News April 15, 2025
ASF: కులాంతరం వివాహం.. ప్రభుత్వ సాయం

కులాంతర వివాహాలు చేసుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ అన్నారు. సోమవారం ఆసిఫాబాద్ కలెక్టరేట్ సమావేశం మందిరంలో కులాంతర వివాహం చేసుకున్న 8 జంటలకు రూ. 20 లక్షల ఆర్థికసాయం అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలసి అందజేశారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో జంటకి రూ.2.5 లక్షలు ప్రభుత్వం చేయూతనిస్తుందని పేర్కొన్నారు.