News April 13, 2025
అంతర్జాతీయ సదస్సుకు ఎంపికైన రీసర్చ్ పేపర్

కురవికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు భూముల రాజేష్ రూపొందించిన యాక్షన్ రీసర్చ్ పేపర్ అంతర్జాతీయ ఇంగ్లీష్ సదస్సుకు ఎంపికైంది. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ టీచర్స్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఏఫారెన్ లాంగ్వేజ్ (IAETFL) వారు ప్రతిఏటా నిర్వహించే సదస్సుకు శనివారం ఆయన తన పరిశోధన పత్రాన్ని సమర్పించారు. రీసర్చ్ పేపర్ ఎంపిక కావడంపై జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయులు హర్షంవ్యక్తం చేశారు.
Similar News
News October 16, 2025
డెక్కన్ సిమెంటు వివాదంతో నాకు సంబంధం లేదు: ఉత్తమ్

TG: డెక్కన్ సిమెంటు కంపెనీ వ్యవహారంతో తనకు సంబంధం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆ వివాదంపై తాను మాట్లాడేది లేదన్నారు. ‘నా ప్రమేయం లేదని కొండా సురేఖ కుమార్తె కూడా చెప్పారు కదా?’ అని ముక్తసరిగా స్పందించారు. కొన్నిరోజులుగా మంత్రి కొండా సురేఖకు ఇతర మంత్రులకు మధ్య వివాదం రేగడం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ అధిష్ఠానం కూడా దృష్టి సారించింది. పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి రంగంలోకి దిగారు.
News October 16, 2025
ములుగు: ఇంటి బాట పట్టిన అడవిలో అన్నలు!

ఆపరేషన్ కగారుతో అడవిలో అన్నలు ఇంటిబాట పడుతున్నారు. కొన్ని నెలలుగా ఛత్తీస్గఢ్ అడవులను కేంద్ర బలగాలు చుట్టుముట్టాయి. దీంతో కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు, అగ్రనేతలు మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలో గురువారం అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ 60 మందితో లొంగిపోగా, మరో నేత ఆశన్న 140 మందితో నేడో, రేపో లొంగిపోనున్నట్లు తెలుస్తోంది. దీంతో విప్లవ శకం ముగిసినట్లేనా అనే చర్చ మొదలైంది.
News October 16, 2025
RGM: 21 నుంచి పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు

ఈనెల 21 నుంచి 31 వరకు పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రామగుండం CP అంబర్ కిషోర్ ఝా గురువారం ప్రకటనలో తెలిపారు. ఓపెన్ హౌస్ కార్యక్రమం, రక్తదాన శిబిరం, సైకిల్ ర్యాలీ, షార్ట్ ఫిలిం, ఫొటోగ్రఫీ పోటీలను నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. పోలీసు అమరులను స్మరిస్తూ కళా ప్రదర్శనలు నిర్వహిస్తామన్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల- పెద్దపల్లి జిల్లాలలో కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.