News April 13, 2025

నంద్యాల: బాదంపప్పుపై ఆంజనేయ స్వామి చిత్రం

image

నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేశ్ హనుమాన్ జయంతి సందర్భంగా.. బాదంపప్పుపై ఆంజనేయస్వామి చిత్రాన్ని చిత్రీకరించాడు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాదంపప్పుపై హనుమంతుడు చిత్రాన్ని చిత్రీకరించడం సంతోషకరంగా ఉందని తెలిపారు. హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని మోసుకు వస్తున్న రూపంలో ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని, వారి ప్రతిభను ప్రముఖులు ప్రత్యేకంగా కొనియాడారు.

Similar News

News December 28, 2025

రూ.26 లక్షలకే గచ్చిబౌలిలో ఫ్లాట్.. అప్లై చేయండిలా

image

TG: హైదరాబాద్ గచ్చిబౌలి, ఖమ్మం, వరంగల్‌లో 339 ఫ్లాట్లను అమ్మాలని హౌసింగ్ బోర్డు నిర్ణయించింది. గచ్చిబౌలిలో 479 నుంచి 603 Sftల ఫ్లాట్ల రేట్ల రూ.26 లక్షల నుంచి రూ.36 లక్షల వరకు ఉన్నాయి. నెలకు రూ.50వేల ఆదాయం ఉన్నవారు JAN 3లోపు మీ సేవ కేంద్రాలతో పాటు HYD SRనగర్‌లోని TGHB ఈఈ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించవచ్చు. జనవరి 6న గచ్చిబౌలి నిర్మిత్ కేంద్రంలో లాటరీ ప్రక్రియ జరగనుంది. సైట్: <>tghb.cgg.gov.in/<<>>

News December 28, 2025

చిట్యాల: రేపటి నుంచి నాపాక బ్రహ్మోత్సవాలు

image

చిట్యాల మండలం నైనుపాక గ్రామ నాపాక ఆలయ శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 29, 30, 31న మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని ఏటా ఆలయం నందు జాతర నిర్వహించి ఎడ్ల బండ్లు, కోలాట బృందాల నృత్య ప్రదర్శనలు, విగ్రహాల ఊరేగింపు వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు. కాగా భక్తులు అధిక సంఖ్యలో హాజరై జాతరను విజయవంతం చేయాలని కోరుతున్నారు.

News December 28, 2025

కేటిదొడ్డి: వైకుంఠ ఏకాదశి పర్వదినానికి వేళాయే..!

image

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఈనెల 30వ తేదీన (మంగళవారం) మండలంలోని వెంకటాపురం గ్రామంలో వెలసిన శ్రీ పాగుంట లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. స్వామివారి దర్శనం తెల్లవారుజామున ఉదయం 5 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి సేవల్లో పాలుపంచుకోవాలని ఆలయ అర్చకులు కోరారు.