News April 13, 2025

ఎన్టీఆర్: అమరావతి శంకుస్థాపనకు చురుకుగా ఏర్పాటు

image

ఈనెల 24-26 తేదీల మధ్య రాజధాని అమరావతి పునః నిర్మాణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో ప్రజలను సమీకరణ చేయనున్నారు. సుమారు 5 నుంచి 5 లక్షల మధ్య ప్రజలు రానున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులు సిద్ధం చేస్తున్నారు. అతిథుల కోసం 4 హెలీప్యాడ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 

Similar News

News March 22, 2026

‘జిల్లాలో 6,027 సిలిండర్లు అందుబాటులో’

image

జిల్లాలో 6027 గ్యాస్ సిలిండర్లు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని బాపట్ల జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి జమీర్ భాషా ఆదివారం తెలిపారు. జిల్లాలోని గ్యాస్ ఏజెన్సీలను తహశీల్దార్లు, సివిల్ సప్లై అధికారులు తనిఖీలు చేపట్టారన్నారు. ఎక్కడైనా గ్యాస్ అక్రమంగా విక్రయించినా, బరువులో తేడాలు ఉన్నా చర్యలు తప్పవని హెచ్చరించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దన్నారు.

News March 22, 2026

కడప జిల్లాకు రానున్న వైఎస్ షర్మిల

image

పీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈనెల 24వ తేదీన సాయంత్రం సింహాద్రిపురం మండలానికి రానుంది. ఇటీవల ఈదురుగాలులకు మండలంలోని కసనూరు గ్రామంలో నేల కూలిన అరటి తోటలను ఆమె పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా ఆమె నష్టపోయిన రైతులతో పంట నష్ట వివరాలు, ఎంత పెట్టుబడి పెట్టారు తదితర విషయాలను అడిగి తెలుసుకోనున్నారు.

News March 22, 2026

ASF జిల్లాలో పోలీసుల వసూళ్ల దందా?

image

జిల్లాలో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మద్యం వ్యాపారుల వద్ద నెలకు రూ.1.15లక్షలు, ఇసుక ట్రాక్టర్ల యజమానుల నుంచి రూ.5వేల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కిరాణా వ్యాపారులను సైతం వదలకుండా హఫ్తాల కోసం వేధిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఓ CI, మరో డివిజన్ స్థాయి అధికారి వ్యాపారులను పిలిపించి వసూలు చేస్తున్నారని బాధితులు DGP శివధర్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.