News April 13, 2025

ఖమ్మం: నేడు వనజీవి రామయ్య అంత్యక్రియలు

image

పద్మశ్రీ వనజీవి రామయ్య అంత్యక్రియలు ఆదివారం అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. అంత్యక్రియలు ఆయన స్వగ్రామం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లిలోని శ్మశానవాటికలో జరగనున్నాయి. అంతిమయాత్రకు జిల్లాలోని మంత్రులు, అధికారులతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి పర్యావరణ ప్రేమికులు పెద్దఎత్తున తరలిరానున్నారు.

Similar News

News April 15, 2025

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు కట్టుదిట్టమైన కార్యాచరణ: కలెక్టర్

image

ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల ఎంపికకు కట్టుదిట్టమైన కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్ 21 లోపు ఇందిరమ్మ కమిటీల నుంచి 25 శాతం బఫర్‌తో ప్రతి గ్రామానికి, వార్డుకు అలాట్ చేసిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితా వివరాలు తెలుసుకోవాలన్నారు.

News April 15, 2025

సీఎం రేవంత్‌కు తప్పిన ప్రమాదం

image

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. సీఎల్పీ భేటీ కోసం నోవాటెల్ హోటల్‌కు వెళ్లగా ఆయన ఎక్కిన లిఫ్టులో సాంకేతిక సమస్య తలెత్తింది. ఎక్కువ మంది ఎక్కడంతో ఓవర్ వెయిట్ కారణంగా లిఫ్ట్ ఆగాల్సిన చోటు కంటే రెండు అడుగులు కిందకి దిగిన లిఫ్ట్. 8 మంది ఎక్కాల్సిన దాంట్లో 13 మంది ఎక్కడంతో సమస్య తలెత్తింది. అప్రమత్తమైన అధికారులు లిఫ్టులో నుంచి రేవంత్‌ను సురక్షితంగా బయటకు తీశారు.

News April 15, 2025

భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్

image

ప్రతీకార టారిఫ్స్‌పై యూఎస్ విరామం ప్రకటించడంతో పుంజుకున్న భారత సూచీలు ఇవాళ భారీ లాభాల్లో ముగిశాయి. దాదాపు అన్ని సెక్టార్లు గ్రీన్‌లోనే ట్రేడయ్యాయి. సెన్సెక్స్ 1577 పాయింట్ల లాభంతో 76,734, నిఫ్టీ 500 పాయింట్లు పొంది 23,328 వద్ద ముగిశాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు 3 శాతం ఎగిశాయి. ఇండస్ఇండ్, యాక్సిస్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, L&T, టాటా మోటార్స్ టాప్ గెయినర్స్.

error: Content is protected !!