News April 13, 2025
వైసీపీ పీఏసీ కమిటీ మెంబర్గా ఆదిమూలపు సురేశ్

వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా కొండపి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త డాక్టర్ ఆదిమూలపు సురేశ్ను శనివారం వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నియమించారు. రాష్ట్రవ్యాప్తంగా నియమించిన 30 మందిలో ఆదిమూలపు సురేశ్ ఒకరు. కొండపి నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో వైసీపీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. వైసీపీ గెలుపే లక్ష్యంగా మున్ముందు పనిచేస్తామన్నారు.
Similar News
News March 15, 2026
పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్తు :SP

పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, జెరాక్స్ సెంటర్లు మూసి వేస్తున్నట్లు మార్కాపురం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద ఇన్విజిలేటర్లు తప్ప ఇతర సిబ్బంది ఎవరు ఉండకూడదని అన్నారు. పరీక్షా నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
News March 15, 2026
పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్తు :SP

పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, జెరాక్స్ సెంటర్లు మూసి వేస్తున్నట్లు మార్కాపురం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద ఇన్విజిలేటర్లు తప్ప ఇతర సిబ్బంది ఎవరు ఉండకూడదని అన్నారు. పరీక్షా నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
News March 14, 2026
పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: డీఈవో రేణుక

పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాధికారి రేణుక తెలిపారు. ఈనెల 16 నుంచి 28వ తేదీ వరకు ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షలు జరుగుతాయన్నారు. రెగ్యులర్ పబ్లిక్ పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు ఉంటాయన్నారు. ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే విద్యార్థులు హాల్ టికెట్ చూపిస్తే ఉచితంగా ప్రయాణం చేయవచ్చన్నారు. SSC పబ్లిక్ పరీక్షల కోసం 165 సెంటర్లు కేటాయించామన్నారు.


