News April 13, 2025
ఏడాది చదువుకు దూరమైన బాలిక నేడు జిల్లా టాపర్

AP: కర్నూలు(D) ఆదోనికి చెందిన పేదింటి విద్యార్థిని నిర్మల ఇంటర్ బైపీసీలో 966 మార్కులతో జిల్లా టాపర్గా నిలిచింది. 2021-22లో టెన్త్లో 537 మార్కులు సాధించినప్పటికీ కుటుంబ ఆర్థిక సమస్యలతో బాలిక ఏడాదిపాటు చదువుకు దూరమైంది. అప్పటి కలెక్టర్ సృజన ప్రోత్సాహంతో ఆమె ఆస్పరి KGBVలో చేరింది. ఫస్టియర్లో 420, సెకండియర్లో 966 మార్కులు సాధించి శభాష్ అనిపించుకుంది. ఐపీఎస్ కావడమే తన లక్ష్యమని చెబుతోంది.
Similar News
News April 15, 2025
వడదెబ్బ బాధితులకు రూ.4 లక్షల పరిహారం

TG: వడదెబ్బతో మరణించినవారి కుటుంబానికి రూ.4 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వడగాలులను విపత్తుగా ప్రకటిస్తూ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా గతంలో వడదెబ్బ బాధితులకు రూ.50 వేల ఎక్స్గ్రేషియా ఇచ్చేవారు. ప్రస్తుతం దానిని ప్రభుత్వం రూ.4 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
News April 15, 2025
పూరీతో సినిమా.. విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

దర్శకుల గత సినిమాల ఫలితాన్ని దృష్టిలో పెట్టుకొని తాను పనిచేయనని నటుడు విజయ్ సేతుపతి చెప్పారు. స్క్రిప్ట్ నచ్చితేనే నటించేందుకు ఓకే చెబుతానని తెలిపారు. దర్శకుడు పూరీ జగన్నాథ్ చెప్పిన కథ నచ్చడంతోనే మూవీ చేసేందుకు అంగీకరించినట్లు పేర్కొన్నారు. ఒకే లాంటి సినిమాలు చేయకుండా జాగ్రత్త పడతానని తెలిపారు. కాగా పూరీతో మూవీ షూటింగ్ జూన్ నుంచి ప్రారంభమవుతుందన్నారు.
News April 15, 2025
సీఎం రేవంత్కు తప్పిన ప్రమాదం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. సీఎల్పీ భేటీ కోసం నోవాటెల్ హోటల్కు వెళ్లగా ఆయన ఎక్కిన లిఫ్టులో సాంకేతిక సమస్య తలెత్తింది. ఎక్కువ మంది ఎక్కడంతో ఓవర్ వెయిట్ కారణంగా లిఫ్ట్ ఆగాల్సిన చోటు కంటే రెండు అడుగులు కిందకి దిగిన లిఫ్ట్. 8 మంది ఎక్కాల్సిన దాంట్లో 13 మంది ఎక్కడంతో సమస్య తలెత్తింది. అప్రమత్తమైన అధికారులు లిఫ్టులో నుంచి రేవంత్ను సురక్షితంగా బయటకు తీశారు.