News April 13, 2025

పార్వతీపురం: జిల్లాలో 266 యూనిట్ల స్థాపనకు రూ.11.03 కోట్లు

image

పార్వతీపురం జిల్లాలో షెడ్యూల్ కులాల యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు 266 యూనిట్ల స్థాపనకు రూ.11.03 కోట్లు కేటాయించినట్టు కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ శనివారం తెలిపారు. స్వయం ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈనెల 14 నుంచి మే 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. దరఖాస్తులు https://apobmms.apcfss.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్లో సమర్పించాలని సూచించారు.

Similar News

News November 15, 2025

జగిత్యాల: గంజాయి కేసులో ముగ్గురికి 7 ఏళ్ల జైలు

image

జగిత్యాల పట్టణ పోలీస్ దర్యాప్తులో బయటపడ్డ గంజాయి పెంపకం, సరఫరా కేసులో ముగ్గురికి జిల్లా ఫస్ట్ అదనపు సెషన్స్ జడ్జి శ్రీ నారాయణ 7 ఏళ్ల జైలు శిక్ష, ఒక్కరికి రూ.10 వేల జరిమానా విధించారు. నిందితులు మేకల రాజు, సాయి, చందు 250 గ్రాముల గంజాయి వ్యాపారంలో ప్రమేయం ఉన్నట్లు నిర్ధారించారు. కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ అభినందించారు.

News November 15, 2025

Way2News కథనం.. మంత్రి ఆదేశాలతో పనులు

image

నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండు అండర్ బ్రిడ్జి, ఫ్లైఓవర్‌పైన జాయింట్ల వద్ద రూ.40లక్షలతో మరమ్మతులు చేపడుతున్నట్లు కమిషనర్ నందన్ తెలిపారు. ఈ పనులు 16వ తేదీ నుంచి సుమారుగా 45 రోజులపాటు జరుగుతాయన్నారు. మంత్రి నారాయణ ఆదేశించినట్లు కమిషనర్ తెలిపారు. ఈ సమస్యపై ఇటీవల “మంత్రి వర్యా.. ఇదీ మీ సమస్య కాదా” అన్న శీర్షికన Way2News కథనం ప్రచురించింది. స్పందించిన మంత్రి మరమ్మతులకు ఆదేశించారు.

News November 15, 2025

కలెక్టరేట్‌లో విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ

image

తిరుపతి కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లా విద్యాశాఖ బాలల దినోత్సవం నిర్వహించింది. ఇందులో భాగంగా రోజూ 3 KMపైగా నడిచి పాఠశాలకు వచ్చే 30 మంది గిరిజన విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సైకిళ్లను దాతలు అందజేశారు. DEO K.V.N.కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థుల పురోగతికి తోడ్పడుతున్న దాతకు విద్యాశాఖ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.