News April 13, 2025
పార్వతీపురం: ఇంటర్ ఫలితాల్లో గిరి విద్యార్థుల ప్రతిభ

ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు DIEO మంజుల వీణ తెలిపారు. మొదటి సంవత్సరం జనరల్ విద్యార్థులు 947 మంది పరీక్షలు రాసి 920 ఉత్తీర్ణత సాధించగా 97.1 శాతం ఉత్తీర్ణత నమోదు అయినట్లు తెలిపారు. ద్వితీయ సంవత్సరం జనరల్ విద్యార్థులు 941 మంది పరీక్షలు రాసి 930 ఉత్తీర్ణత సాధించి 98.8 శాతం ఉత్తీర్ణత నమోదు అయినట్లు వివరాలు వెల్లడించారు.
Similar News
News October 26, 2025
మూడు జిల్లాల కలెక్టర్లకు మంత్రి కొండపల్లి ఫోన్

మోంథా తుఫాన్ నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు, గాలులు తీవ్రంగా కొనసాగే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. ఫోన్ ద్వారా విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు జిల్లాల కలెక్టర్లతో ఆయన మాట్లాడారు. తుఫాను ప్రభావం కారణంగా ఏ పరిస్థితి వచ్చినా.. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
News October 26, 2025
GWL: కురుమూర్తి జాతరకు స్పెషల్ బస్సులు-DM

మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం కురుమూర్తి రాయుడి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈనెల 28, 29 తేదీల్లో గద్వాల డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ సునీత ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు. మొదటి ట్రిప్పు గద్వాల నుంచి బయలుదేరి అనంతరం ఆత్మకూరు నుంచి కురుమూర్తి వరకు అవసరమైనన్ని ట్రిప్పులు నడుస్తాయన్నారు. భక్తులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
News October 26, 2025
CMతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిన ప్రకాశం కలెక్టర్

ప్రకాశం కలెక్టర్ రాజబాబు ఆదివారం సీఎం చంద్రబాబు నాయుడు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి సీఎం వివరించారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగం చేపట్టిన ముందస్తు జాగ్రత్తలను కలెక్టర్ వివరించారు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు.


