News April 13, 2025

అనకాపల్లి: ‘బ్యాంకు లావాదేవీల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి’

image

బ్యాంకు లావాదేవీల నిర్వహణలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా శనివారం హెచ్చరించారు. UPI పిన్, OTPని బ్యాంకు వారితో కాకుండా ఎవరితోనూ షేర్ చేయవద్దన్నారు. బ్యాంకు వివరాలు ఇతరులకు చెప్పేముందు ఒక్కసారి ఆలోచించాలని సూచించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930కి ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News September 16, 2025

జగిత్యాల: ఈవీఎం గోదామును తనిఖీ చేసిన కలెక్టర్

image

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంప్‌లో గల ఈవీఎం గోదామును రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు కలెక్టర్ సత్యప్రసాద్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భద్రత ఏర్పాట్లు, సిసి కెమెరాల పనితీరులను పరిశీలించారు. గోదాం వద్ద ఎలాంటి లోపాలు లేకుండా పటిష్ట భద్రతతో ఉండాలని, అప్రమత్తతో పర్యవేక్షించాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్, ఆర్డీవో మధుసూదన్ తదితరులున్నారు.

News September 16, 2025

పుట్ట మధు ఇంటి ముందు ధర్నా చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

image

మంథనిలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఇంటి ముందు మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. పెంచికల్ పేట గ్రామంలో సోమవారం స్వర్గీయ శ్రీపాద రావు, మంత్రి శ్రీధర్ బాబుపై పుట్ట మధుకర్ చేసిన వ్యాఖ్యలకు నిరసన తెలిపారు. అనంతరం పుట్ట మధుకు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించారు. ఇదే క్రమంలో అంబేడ్కర్, శ్రీపాద రావు విగ్రహాలకు పాలాభిషేకం చేసి, పూలమాలలు వేశారు.

News September 16, 2025

పాక్‌కు అవమానం.. మాట ప్రకారం తప్పుకుంటుందా?

image

IND vs PAK మ్యాచ్‌‌ రిఫరీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని PCB చేసిన <<17717948>>ఫిర్యాదును<<>> రిజెక్ట్ చేసినట్లు ICC అధికారికంగా ప్రకటించింది. దీంతో ఆయనపై చర్యలు తీసుకోకపోతే ఆసియా కప్‌ నుంచి తప్పుకుంటామన్న పాక్‌‌కు ఘోర అవమానం ఎదురైంది. మొన్న గ్రౌండ్లో ప్లేయర్లకు, ఇప్పుడు ఆ దేశ బోర్డుకు భంగపాటు తప్పలేదు. మాట మీద నిలబడి టోర్నీ నుంచి తప్పుకుంటే పాక్‌కు కనీస మర్యాదైనా దక్కుతుందేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.