News April 13, 2025

అనకాపల్లి: ‘బ్యాంకు లావాదేవీల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి’

image

బ్యాంకు లావాదేవీల నిర్వహణలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా శనివారం హెచ్చరించారు. UPI పిన్, OTPని బ్యాంకు వారితో కాకుండా ఎవరితోనూ షేర్ చేయవద్దన్నారు. బ్యాంకు వివరాలు ఇతరులకు చెప్పేముందు ఒక్కసారి ఆలోచించాలని సూచించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930కి ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News April 5, 2026

భద్రాచలం పక్కనున్న 5 గ్రామాలను TGలో కలపండి: తుమ్మల

image

భద్రాచలం పక్కన ఉన్న 5 గ్రామాలను ఏపీ నుంచి తెలంగాణలో కలపాలని కేంద్రాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కోరారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ‘పాలనా సౌలభ్యం కోసం పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల, ఎటపాక, కన్నాయిగూడెం గ్రామాలను తిరిగి తెలంగాణలో చేర్చండి. అలాగైతేనే గిరిజనుల సమస్యలు తొలగిపోతాయి. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే విలీనం బిల్లు పెట్టేలా చూడండి’ అని కోరారు.

News April 5, 2026

‘చలో ఆకివీడు’ భగ్నం.. నిందితుల బైండోవర్

image

‘చలో ఆకివీడు’ కార్యక్రమంలో భాగంగా అనుమతి లేకుండా తరలివచ్చిన 73 మందిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై హనుమంతు నాగరాజు తెలిపారు. నిందితులను తహశీల్దారు ఎదుట హాజరుపరిచి బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు. భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు పర్యవేక్షణలో పట్టణమంతటా భారీ పోలీసు బలగాలతో కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.

News April 5, 2026

రేపు భీమవరం వన్‌టౌన్‌లో పోలీస్ PGRS

image

భీమవరం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ వేదికను తాత్కాలికంగా మార్చినట్లు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. గొల్లలకోడేరులోని జిల్లా పోలీస్ కార్యాలయానికి బదులుగా, ఈ వారం అర్జీల స్వీకరణ భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో జరుగుతుందని అన్నారు. ప్రజలు ఈ మార్పును గమనించి తమ సమస్యలపై విన్నపాలు సమర్పించేందుకు నేరుగా వన్‌ టౌన్ స్టేషన్‌కు రావాలని ఎస్పీ కోరారు.