News April 13, 2025
సియాచిన్ డే: భారత జవాన్ల ధీరత్వానికి సెల్యూట్

భారత ఆర్మీ ఇవాళ సియాచిన్ డే సందర్భంగా జవాన్ల సేవలను స్మరించుకుంది. ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధ భూమిగా పేరుగాంచిన సియాచిన్లో భారత ఆర్మీ 1984లో ఇదే రోజున ఆపరేషన్ మేఘదూత్ చేపట్టి కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది. పాక్ సరిహద్దులోని సియాచిన్పై పూర్తి పట్టు సాధించింది. దశాబ్దాలుగా అక్కడి విపరీత వాతావరణ పరిస్థితులను తట్టుకుని రక్షణగా నిలుస్తున్న జవాన్ల ధీరత్వానికి సెల్యూట్.
Similar News
News April 15, 2025
UPDATE.. కింగ్డమ్ డబ్బింగ్ స్టార్ట్

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘కింగ్డమ్’ మూవీ డబ్బింగ్ ప్రారంభమైనట్లు హీరో విజయ్ దేవరకొండ ఇన్స్టా స్టోరీలో తెలిపారు. ఇప్పటికే సగం పార్ట్ పూర్తయిందని వెల్లడించారు. విజయ్ స్టోరీని తెలియజేస్తూ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ట్వీట్ చేసింది. మే 30న సినిమాను విడుదల చేసేందుకు దర్శకుడు-హీరో సిద్ధమయ్యారని రాసుకొచ్చింది.
News April 15, 2025
రేపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ పేర్లను చేర్చినందుకు నిరసనగా రేపు దేశవ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈడీ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించాలని పార్టీ నేతలకు సూచించింది. ఈమేరకు అన్ని రాష్ట్రాల పీసీసీలకు లేఖ రాసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలందరూ వీటిలో పాల్గొనాలని పేర్కొంది.
News April 15, 2025
విద్యార్థులకు గుడ్ న్యూస్.. గడువు పొడిగింపు

AP: పాలిసెట్ దరఖాస్తుల గడువును సాంకేతిక విద్యాశాఖ పొడిగించింది. ఈ నెల 17 వరకు <