News April 13, 2025
KMM: తెల్లవారుజామున ప్రమాదం.. యువకుడి మృతి

రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. నేలకొండపల్లి మండల కేంద్రంలోని డిగ్రీ కళాశాల సమీపంలో హైవేపై ఆగి ఉన్న ట్రాక్టర్ ట్రాలీని బైక్ ఢీకొనడంతో బైక్పై ఉన్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
Similar News
News March 26, 2026
ఖమ్మం: మద్ధతు ధర లేక రైతుల విలవిల

ఖమ్మం జిల్లాలో యాసంగి పెసర రైతులకు మద్దతు ధర దక్కక కన్నీరు మిగులుతోంది. ప్రభుత్వం క్వింటాకు ₹8,882 ధర నిర్ణయించినా, కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో వ్యాపారులు సిండికేట్గా మారి ₹7,000 లోపే చెల్లిస్తున్నారు. నాణ్యత సాకుతో మరికొంత ధర తగ్గిస్తుండటంతో రైతులు క్వింటాకు ₹1,800 పైగా నష్టపోతున్నారు. సాగు విస్తీర్ణం తగ్గినా, పండిన పంటకు గిట్టుబాటు ధర లేక పెసర రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
News March 25, 2026
2 చోట్ల ఓటుంటే చట్టరీత్యా నేరం: అ.కలెక్టర్ శ్రీజ

వైరా: ఓటర్ల జాబితాలో అక్రమాలకు తావులేకుండా, పారదర్శకమైన జాబితా రూపొందించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని అదనపు కలెక్టర్ శ్రీజ ఆదేశించారు. వైరాలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఓటర్ల జాబితా సవరణలు, కొత్త ఓటర్ల చేర్పులపై నియోజకవర్గ స్థాయి అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. దేశంలో ఎక్కడైనా ఒక వ్యక్తికి ఒకే చోట ఓటు హక్కు ఉండాలని, రెండు చోట్ల ఓటు కలిగి ఉండటం శిక్షార్హమైన నేరమని ఆమె స్పష్టం చేశారు.
News March 25, 2026
2 చోట్ల ఓటుంటే చట్టరీత్యా నేరం: అ.కలెక్టర్ శ్రీజ

వైరా: ఓటర్ల జాబితాలో అక్రమాలకు తావులేకుండా, పారదర్శకమైన జాబితా రూపొందించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని అదనపు కలెక్టర్ శ్రీజ ఆదేశించారు. వైరాలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఓటర్ల జాబితా సవరణలు, కొత్త ఓటర్ల చేర్పులపై నియోజకవర్గ స్థాయి అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. దేశంలో ఎక్కడైనా ఒక వ్యక్తికి ఒకే చోట ఓటు హక్కు ఉండాలని, రెండు చోట్ల ఓటు కలిగి ఉండటం శిక్షార్హమైన నేరమని ఆమె స్పష్టం చేశారు.


