News April 13, 2025
సింహాచలం: చందనోత్సవానికి 51 ప్రత్యేక బస్సులు

సింహాచలంలో ఏప్రిల్ 30న జరిగే చందనోత్సవానికి కొండ మీదకు 51 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు శనివారం తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా కొండమీదకు వెళ్లే బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. గోశాల, శ్రీనివాస్ నగర్, అడివివరం నుంచి ఈ బస్సులు నడపనున్నట్లు పేర్కొన్నారు. ఆరోజున భక్తుల వాహనాలకు కొండమీదకు అనుమతి లేదని, ఈ బస్సులు వినియోగించుకోవాలన్నారు.
Similar News
News November 11, 2025
కామారెడ్డి జిల్లాలో భూముల రీసర్వేకు కలెక్టర్ గ్రీన్ సిగ్నల్

కామారెడ్డి జిల్లాలోని 16 మండలాల పరిధిలో భూముల రీసర్వే పనులను చేపట్టడానికి జిల్లా కలెక్టర్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. భూములకు సంబంధించిన స్వంతదారులు, రిజిస్టర్ దారులు సరిహద్దులు గుర్తించడానికి అవసరమైన సమాచారంతో తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ సూచించారు. జిల్లా ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే శ్రీనివాస్ పర్యవేక్షణలో ఈ రీసర్వే జరుగుతుందని కలెక్టర్ ప్రకటించారు.
News November 11, 2025
రన్నర్గా తూ.గో జిల్లా అధికారులు

అనంతపురంలో ఈనెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు 7వ రాష్ట్రస్థాయి రెవెన్యూ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్-2025 జరిగింది. ఇందులో తూ.గో జిల్లా రెవెన్యూ అధికారులు, సిబ్బంది ప్రతిభ చూపారు. బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో కడియం తహసీల్దార్ ఎం.సునీల్ కుమార్, రాజానగరం సీఎస్ డీటీ జి.బాపిరాజు జట్టు రన్నర్గా నిలిచారు. వాలీబాల్ విభాగంలో తూ.గో జట్టు రన్నర్గా నిలిచింది.
News November 11, 2025
ముంబై ఆ ఇద్దరిని వదిలేయాలి: హెడెన్

IPL రిటెన్షన్స్ ప్రకటనకు ముందు ముంబై ఇండియన్స్కు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ హెడెన్ కీలక సూచనలు చేశారు. గత వేలంలో అధిక ధరకు కొనుగోలు చేసిన బౌల్ట్(₹12.5Cr), దీపక్ చాహర్(₹9.25Cr)ను వదిలేయాలని అభిప్రాయపడ్డారు. వీరిద్దరినీ వదిలేస్తే పర్స్ ఎక్కువగా మిగులుతుందని, టీమ్ బెంచ్ స్ట్రెంత్ను స్ట్రాంగ్ చేసుకోవచ్చన్నారు. అవసరమైతే వారిని మళ్లీ తక్కువ ధరకు మినీ వేలంలో తీసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.


