News April 13, 2025

కైలాసపట్నంలో మృతి చెందిన వారి వివరాలు ఇవే

image

అనకాపల్లి జిల్లా కైలాసపట్నం మందు గుండు తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు ఘటనలో ఎనిమిది మంది మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతి చెందిన వారిలో అప్పికొండ తాతబాబు(50), సంగరాతి గోవిందు(45), దాడి రామలక్ష్మి(38), దేవర నిర్మల(38),పురం పాప(40),గుంపిన వేణుబాబు(40),సేనాపతి బాబురావు(56), మనోహర్ ఉన్నారు. మరికొద్ది సేపటిలో హోం మంత్రి వంగలపూడి అనిత సంఘటనా స్థలానికి రానున్నారు.

Similar News

News March 3, 2026

‘HANUMAN ప్రాజెక్ట్’ లక్ష్యం ఇదే..

image

AP: మానవులు, వన్యప్రాణుల మధ్య సంఘర్షణను నివారించడమే ‘HANUMAN ప్రాజెక్ట్’ ఉద్దేశమని Dy.CM పవన్ కళ్యాణ్ అన్నారు. మనుషులు, వ్యవసాయానికి నష్టం కలిగిస్తున్న వన్యప్రాణులను ఎలా హ్యాండిల్ చేయాలనే ఆలోచనతోనే దీన్ని ప్రారంభించామన్నారు. ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించడం, సరిహద్దు గ్రామాల ప్రజల ఉపాధిని కాపాడడమే ఈ ప్రాజెక్టు కర్తవ్యమన్నారు. సంఘర్షణ జరిగినప్పుడు వెంటనే స్పందించి ఉపశమన చర్యలను చేపడతామన్నారు.

News March 3, 2026

నువ్వు 9 నెలలు మోసి కన్న పిల్లలే కదమ్మా!

image

TG: బిడ్డ కడుపులో పడగానే తల్లి సంతోషం అంతాఇంతా కాదు. పుట్టాక బిడ్డను ఎన్నిసార్లు ముద్దాడుతుందో.. అందంగా అలంకరించి ఎంతగా మురిసిపోతుందో మాటల్లో వర్ణించలేని అనుభూతి. పిల్లలకు జ్వరమొస్తేనే తట్టుకోలేని తల్లి వారి ఊపిరినే ఆపడం గుండెలు పిండేసే విషాదం. భువనగిరి(D) గొల్లగూడెంలో 10 నెలల బాబు, పాప(2)ను చంపి తానూ తనువు చాలించిందో తల్లి. కుటుంబ కలహాలే కారణమని తెలుస్తున్నా పిల్లలను చంపడం కంటతడి పెట్టిస్తోంది.

News March 3, 2026

అరణ్యంలో రోడ్డు ప్రమాదాలతో వన్యప్రాణులు మృతి!

image

ఓరుగల్లు అరణ్య ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలతో వన్యప్రాణులు మృతి చెందుతున్నాయి. అవి ఆహారం కోసం అటవీ ప్రాంతాల గుండా వెళ్లే రోడ్డు పైకి వస్తుంటాయి. చిరుతలు, దుప్పులు, కోతులు, పాములు, అడవి పందులు, నక్కలు, కృష్ణ జింకలు, అడవి పందులు, కోతులు, ఎలుగుబంట్లు, తోడేళ్లు, అడవి కోళ్లు, నెమళ్లు, వివిధ రకాల పాములు ప్రమాదాలకు గురవుతున్నాయి. వాహనదారులు నెమ్మదిగా వెళ్తే వాటికి హాని ఉండదు.
# నేడు వరల్డ్ వైల్డ్ లైఫ్ డే