News March 27, 2024
HYD: ఇనుప రాడ్డు మెడకు గుచ్చుకొని వ్యక్తి మృతి

ఓ కార్మికుడు మృతిచెందిన ఘటన HYD KPHB PS పరిధిలో జరిగింది. SI సుమన్ తెలిపిన వివరాలు.. బాలానగర్ వాసి పవన్(35) ఫ్యాబ్రికేషన్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. KPHB రోడ్ నం.1లోని ఐరిస్ షోరూమ్ షట్టర్ మరమ్మతులు చేసేందుకు వచ్చాడు. నిచ్చెన వేసుకుని మరమ్మతులు చేస్తుండగా షట్టర్ రాడ్డు హైటెన్షన్ విద్యుత్ తీగకు తగిలింది. దీంతో కరెంట్ షాక్కు గురై కింద ఇనుప రాడ్డుపై పడటంతో అది మెడకు గుచ్చుకొని మృతిచెందాడు.
Similar News
News April 3, 2026
HYD: దారుణ హత్య.. మూసీలో ఎముకల లభ్యం

HYD శివారు మేడిపల్లి PS పరిధిలో అదృశ్యమైన వ్యక్తి హత్యకు గురయ్యాడు. చెంగిచర్ల గణేష్నగర్కు చెందిన పండిపాటి బక్కయ్య (33) గతేడాది DEC30న పనికి వెళ్లి కనిపించకుండా పోయాడు. JAN21న మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. కొర్రెముల మూసీ వంతెన వద్ద సంచిలో ఎముకలు స్వాధీనం చేసుకున్నారు. పని ప్రాంత వివాదమే హత్యకు కారణమని నిర్ధారించారు.
News April 3, 2026
HYDలో ట్రాఫిక్ జామ్.. కారణం ఇదే!

ఐటీ కారిడార్లోని సైబర్ టవర్స్ వద్ద మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన సర్వేలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. ఉదయం వేళ కేవలం ఒక గంటలోనే ఏకంగా 10,138 మంది ఒంటరి వాహనదారులు (సింగిల్ రైడర్లు) వెళ్లినట్లు గుర్తించారు. డబుల్ రైడర్లు 3,584 మంది మాత్రమే ఉన్నారని తేలింది. ఈ స్థాయిలో సింగిల్ రైడర్ల సంఖ్య పెరగడం వల్లే రోడ్లపై తీవ్ర ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయని అధికారులు స్పష్టం చేశారు.
News April 3, 2026
HYD: ఇద్దరు IAS అధికారులకు పోస్టింగ్లు

తెలంగాణలో ఇద్దరు ఐఏఎస్ అధికారులకు పోస్టులు కేటాయిస్తూ సీఎస్ రామకృష్ణ రావు ఉత్తర్వులు జారీ చేశారు. వాణి ప్రసాద్ను యువజన అభివృద్ధి, పర్యాటకం, సంస్కృతి శాఖకు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమించారు. జయేష్ రంజన్ అర్బన్ డెవలప్మెంట్ శాఖలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కొనసాగుతూ.. క్రీడా శాఖకు అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.


