News April 13, 2025
విశాఖ జూలో 27 జింకల జననం

విశాఖ ఇందిరా గాంధీ జంతు ప్రదర్శన శాలలో 27 జింకలు పుట్టినట్లు క్యూరేటర్ మంగమ్మ ఆదివారం తెలిపారు. జూ పార్క్లో జంతువుల సంతానోత్పత్తి, పరిరక్షణ ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. వీటిలో ఒక మౌస్ డీర్, రెండు బార్కింగ్ డీర్, మూడు నీల్ ఘై, ఐదు సాంబార్ డీర్, ఏడు స్పాటెడ్ డీర్, తొమ్మిది బ్లాక్ బక్స్ ఉన్నాయన్నారు. జూ సందర్శకులు ఈ అందమైన జింకలను చూసేందుకు మరికొద్ది రోజుల్లో అవకాశం కల్పిస్తామన్నారు.
Similar News
News April 16, 2025
విశాఖ: అవిశ్వాస తీర్మానం నోటీసు తిరస్కరణ

జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కట్టమూరి సతీష్పై ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసు చెల్లదని ఇన్ ఛార్జ్ కమిషనర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. సెక్షన్ 91 ఏ, పురపాలక చట్టం 1955 ప్రకారం నోటీసును తిరస్కరించినట్లు వెల్లడించారు. ఈ చట్టం ప్రకారం నాలుగేళ్లు పూర్తి కాకుండా అవిశ్వాసం పెట్టడం వీలుకాదన్నారు. సతీశ్ 2021 జూలై 30న బాధ్యతలు స్వీకరించారన్నారు.
News April 16, 2025
ఇళ్ల క్రమబద్ధీకరణకు దరఖాస్తుల స్వీకరణ: విశాఖ జేసీ

విశాఖలో ఇళ్ల క్రమబద్ధీకరణ జీవో నంబర్ 30 కింద దరఖాస్తుదారులు సమీప గ్రామ, వార్డు సచివాలయలలో అందజేయాలని జాయింట్ కలెక్టర్ మయూర అశోక్ తెలిపారు. నిర్దేశిత డాక్యుమెంట్లతో పాటు, వార్షికాదాయం గ్రామాల్లో రూ.1,20,000, పట్టణాల్లో రూ.1,44,000గా ఉండాలన్నారు. ఖాళీస్థలాలు, పూరిగుడిసెల క్రమబద్ధీకరణకు అనర్హమని అన్నారు. కుటుంబంలో స్త్రీ పేరున దరఖాస్తు చేయాలని సూచించారు.
News April 16, 2025
విశాఖ: ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

విశాఖలో ఇంటర్ విద్యార్థి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కూర్మన్నపాలెం ప్రాంతానికి చెందిన వేదాంత కార్తికేయ మారికవలస ఓజోన్ వ్యాలీలోని శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరాడు. బుధవారం ఉదయం హస్టల్ గదిలో ఉరివేసుకొని చనిపోయాడు. మృతదేహాన్ని విశాఖలోని ఓ ఆస్పత్రికి తరలించారు. వీరి స్వగ్రామం విజయనగరం జిల్లా గరివిడి అని కాలేజీ సిబ్బంది తెలిపారు.