News April 13, 2025
క్షిపణి దాడిలో 31 మంది మృతి

ఉక్రెయిన్లోని సుమీ నగరంపై రష్యా సైన్యం బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 31 మంది మరణించినట్లు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ వెల్లడించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారని, 84 మందికి పైగా గాయపడ్డారని తెలిపారు. ప్రపంచ దేశాలు మౌనంగా ఉండకుండా రష్యా దాడులను ఖండించాలని ఆయన కోరారు. రష్యాపై బలమైన ఒత్తిడి తీసుకురాకపోతే ఈ యుద్ధాన్ని ఇలాగే కొనసాగిస్తుందని అన్నారు.
Similar News
News September 16, 2025
75% హాజరు ఉంటేనే పరీక్షలకు అనుమతి

CBSE విద్యార్థులు టెన్త్, 12వ తరగతి పరీక్షలు రాయాలంటే 75% హాజరు ఉండాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రకటించింది. ప్రస్తుతం ఫలితాల వెల్లడికి ఇంటర్నల్ అసెస్మెంట్ తప్పనిసరి. అయితే హాజరు శాతం తక్కువగా ఉంటే అసెస్మెంట్ సాధ్యం కావట్లేదని బోర్డు పేర్కొంది. దీంతో కఠినంగా 75% హాజరు నిబంధన అమలు చేయాలని నిర్ణయించింది. ఫలితంగా హాజరుశాతం, క్లాస్రూం యాక్టివిటీస్ పెరుగుతాయని భావిస్తోంది.
News September 16, 2025
సెంట్రల్ సెక్టార్ స్కాలర్షిప్కు దరఖాస్తులు ఆహ్వానం

డిగ్రీ, PG, మెడిసిన్, ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులకు సెంట్రల్ సెక్టార్ స్కాలర్షిప్ స్కీమ్ పేరుతో కేంద్రం స్కాలర్షిప్ అందిస్తోంది. డిగ్రీ విద్యార్థులకు ఏటా రూ.12వేల చొప్పున మూడేళ్ల వరకు, PG విద్యార్థులకు రూ.20వేల చొప్పున రెండేళ్ల వరకు అందిస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 31. వెబ్సైట్: https://scholarships.gov.in/
News September 16, 2025
CLAT-2026కు దరఖాస్తు చేశారా?

జాతీయ స్థాయిలో న్యాయవిద్య కోసం CLAT-2026కు దరఖాస్తులు కోరుతున్నారు. నేషనల్ లా యూనివర్సిటీల్లో UG, PG కోర్సుల్లో ప్రవేశాలకు OCT-31వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ. 4000, SC, ST, దివ్యాంగులు రూ. 3,500 చెల్లించాల్సి ఉంటుంది. DEC 7న పరీక్ష నిర్వహించనున్నారు. UG కోర్సులకు ఇంటర్, PG కోర్సులకు LLB డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.