News April 13, 2025
క్షమాపణలు చెప్పను: రాకేశ్ రెడ్డి

TGPSC తనకు పరువునష్టం నోటీసులు <<16075233>>పంపడంపై <<>>BRS నేత రాకేశ్ రెడ్డి స్పందించారు. ‘పూర్తి ఆధారాలతో గ్రూప్-1 అవకతవకలు బయటపెట్టాం. వాటికి TGPSC సమాధానం చెప్పట్లేదు. కమిషన్ ఇలా పరువునష్టం నోటీసులు ఇవ్వడం దేశంలోనే ప్రథమం. నోటీసులు ఇచ్చినా నేను క్షమాపణలు చెప్పను. న్యాయవిచారణ జరిపిస్తే ఆధారాలు చూపిస్తాం. నేనే TGPSCపై పరువునష్టం దావా వేయబోతున్నా. అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం’ అని స్పష్టం చేశారు.
Similar News
News April 16, 2025
IPL: ఢిల్లీ స్కోర్ ఎంతంటే?

రాజస్థాన్తో జరుగుతున్న మ్యాచులో ఢిల్లీ 20 ఓవర్లలో 188/5 రన్స్ చేసింది. ఓపెనర్ అభిషేక్ పొరెల్ 49 రన్స్ చేసి ఒక్క పరుగు తేడాతో హాఫ్ సెంచరీ మిస్ అయ్యారు. గత మ్యాచులో అదరగొట్టిన కరుణ్ నాయర్ను ఈసారి దురదృష్టం వెంటాడింది. ఖాతా తెరవకుండానే రనౌట్ అయ్యారు. అక్షర్ కెప్టెన్ ఇన్నింగ్స్(34) ఆడగా, రాహుల్ 38, స్టబ్స్ 34* రన్స్తో రాణించారు. RR బౌలర్లలో ఆర్చర్ 2, తీక్షణ, హసరంగా తలో వికెట్ తీశారు.
News April 16, 2025
ఈ నెల 20న BJP జాతీయ అధ్యక్షుడి ప్రకటన?

బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ఈ నెల 20న ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ అగ్రనేతలు ప్రధాని మోదీ నివాసంలో సమావేశమయ్యారు. అధ్యక్ష పదవి రేసులో మోహన్ లాల్ ఖట్టర్, శివరాజ్ సింగ్ చౌహన్ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు 18, 19 తేదీల్లో పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను ప్రకటించనున్నట్లు సమాచారం.
News April 16, 2025
రేపు ఫలితాలు విడుదల

జేఈఈ మెయిన్స్ ఫలితాలను NTA రేపు విడుదల చేయనుంది. B.E, B.Techలో ప్రవేశాల కోసం పరీక్ష రాసిన విద్యార్థులు అన్సర్ కీతో పాటు ఫలితాలను రేపు తెలుసుకోవచ్చు. ఇందుకోసం విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాగా ఏప్రిల్ 2,3,4,7,8 తేదీల్లో B.E, B.Tech ప్రవేశాల కోసం, ఏప్రిల్ 9న బీఆర్కే, బీప్లాన్ ఎంట్రన్స్ కోసం పరీక్షలు నిర్వహించారు.
వెబ్సైట్: <