News April 13, 2025

అనకాపల్లి విషాదం.. ప్రధాని దిగ్భ్రాంతి

image

AP: అనకాపల్లి జిల్లా కోటవురట్ల(మ) కైలాసపట్నంలో పేలుడు ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన చాలా బాధాకరమని, గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ₹2లక్షలు, గాయపడ్డవారికి ₹50వేల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్లు వెల్లడించారు. కాగా AP ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ₹15లక్షల <<16086795>>సాయం <<>>ప్రకటించింది.

Similar News

News February 20, 2026

దేవుడంటే వైసీపీకి గౌరవం లేదు: పయ్యావుల

image

AP: దేవుడి పట్ల వైసీపీకి ఏమాత్రం గౌరవం లేదని ఇవాళ్టి చర్యలతో నిరూపితమైందని మంత్రి పయ్యావుల కేశవ్ ఫైరయ్యారు. సభలోకి దేవుడి <<19190397>>ఫొటోలు<<>> తీసుకురావడంపై సహచర మంత్రులతో కలిసి మండలి ఛైర్మన్ మోషేన్ రాజుకు ఫిర్యాదు చేశారు. వైసీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. రెచ్చగొట్టే చర్యలతో సభను అడ్డుకోవాలని చూస్తే ఏమనుకోవాలని ప్రశ్నించారు. ప్లకార్డులో వెంకన్న ఫొటో వాడి చెప్పులతో ర్యాలీ చేస్తారా? అని నిలదీశారు.

News February 20, 2026

ఫోన్‌పేలో బయోమెట్రిక్.. ఇలా యాక్టివేట్ చేసుకోండి

image

రూ.5వేల లోపు ట్రాన్సాక్షన్ల కోసం ఫోన్‌పే <<19185907>>బయోమెట్రిక్<<>> ఫీచర్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీన్ని యాక్టివేట్ చేయాలంటే ఫోన్‌పే యాప్‌లో ఎడమ వైపు కార్నర్‌లో ఉండే ప్రొఫైల్ ఓపెన్ చేయాలి. అందులో మేనేజ్ పేమెంట్స్‌పై క్లిక్ చేస్తే కింద Biometric Pay కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి పిన్ ఎంటర్ చేస్తే చాలు. ఇందుకోసం ప్లేస్టోర్‌లో యాప్ అప్‌డేట్ చేసుకోవాలి. ఈ ఫీచర్ iOS యూజర్లకు అందుబాటులో లేదు.

News February 20, 2026

ఇంటి చిట్కాలు

image

* కొవ్వొత్తులను వెలిగించే ముందు వాటి పైభాగాన కాస్త ఉప్పు రాస్తే ఎక్కువ సమయం వెలుగుతాయి.
* చెత్తబుట్టలో బ్యాక్టీరియా చేరి దుర్వాసన రాకుండా ఉండాలంటే.. బుట్ట అడుగు భాగంలో కొంచెం బొరాక్స్‌ పొడి చల్లాలి.
* కాస్త వెనిగర్‌లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ కలిపి డైనింగ్ టేబుల్ తుడిస్తే ఎలాంటి మరకలైనా పోతాయి.
* ట్యాపులపై ఉండే మచ్చలు పోయి కొత్తవాటిలా మెరవాలంటే వారానికోసారి నిమ్మకాయ ముక్కతో రుద్దాలి.