News April 13, 2025
రూ.300 కోట్లతో రిటైనింగ్ వాల్: మంత్రి లోకేశ్

మహానాడు ప్రాంతంలో వరద ముంపు నివారణకు రూ.300 కోట్లతో రిటైనింగ్ వాల్ మంజూరైందని, పనులకు త్వరలో శంకుస్థాపన చేస్తామని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. మంగళగిరి రూరల్ యర్రబాలెంలోని మన ఇల్లు-మన లోకేశ్ కార్యక్రమంలో భాగంగా 5వరోజు మహానాడు కాలనీవాసులకు పట్టాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రిటైనింగ్ వాల్ నిర్మాణంపై ఆయన మాట్లాడారు. మంగళగిరిని అన్నివిధాలా అభివృద్ధి చేస్తామన్నారు.
Similar News
News April 17, 2025
GNT: బోరుగడ్డ అనిల్కు రిమాండ్ పొడిగింపు

ఫిరంగిపురం PSలో నమోదైన కేసులో రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్కు నరసరావుపేట కోర్టు రిమాండ్ను ఈ నెల 28 వరకు పొడిగించింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్లపై సోషల్ మీడియా ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అనిల్ను గతంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అనిల్ రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో కోర్టు మరోసారి రిమాండ్ పొడిగించింది.
News April 16, 2025
GNT: బోరుగడ్డ అనిల్కు రిమాండ్ పొడిగింపు

ఫిరంగిపురం PSలో నమోదైన కేసులో రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్కు నరసరావుపేట కోర్టు రిమాండ్ను ఈ నెల 28 వరకు పొడిగించింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్లపై సోషల్ మీడియా ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అనిల్ను గతంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అనిల్ రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో కోర్టు మరోసారి రిమాండ్ పొడిగించింది.
News April 16, 2025
గుంటూరు జిల్లాపై కందుకూరి వీరేశలింగం ప్రభావం

తెలుగు సామాజిక సంస్కర్త కందుకూరి వీరేశలింగం గుంటూరు జిల్లాపై గొప్ప ప్రభావం చూపారు. 1902లో ఉన్నవ దంపతులు గుంటూరులో నిర్వహించిన మొదటి వితంతు పునర్వివాహ వేడుకకు ఆయన హాజరయ్యారు. బాలికల విద్య, స్త్రీ సాధికారత కోసం పాఠశాలలు స్థాపించడంతోపాటు, బాల్య వివాహాలు, వరకట్నం వంటి సంప్రదాయాలను వ్యతిరేకించారు. ఆయన సంస్కరణలు నేటికీ ప్రాంతీయ సామాజిక వికాసానికి దోహదపడుతున్నాయి.