News April 13, 2025

బాలానగర్‌ ఘటన.. మృతుడి వివరాలు (UPDATE)

image

బాలానగర్‌లో RTC బస్ కింద పడి ఓ బైకర్ మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుడు AP కొనసీమ జిల్లాకు చెందిన జోష్ బాబు(బాబ్జీ)గా పోలీసులు గుర్తించారు. రన్నింగ్‌లో ఉన్న వెహికిల్‌ను ఆపే క్రమంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ చొక్కా పట్టుకొని లాగారని PSలో మృతుడి కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. సీసీ కెమెరాల ఆధారంగా బాలానగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News April 16, 2025

అలంపూర్: రూ.400 కోట్లతో మాస్టర్ ప్లాన్

image

అలంపురం జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.450 కోట్లతో బృహత్తర ప్రణాళికను సిద్ధం చేసింది. ఆలయ పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేసి ఆలయానికి వచ్చే భక్తుల రాక మార్గానికి సుగమం చేస్తూ దివ్యానుభూతి పొందే వాతావరణాన్ని తీర్చిదిద్దే మాస్టర్ ప్లాన్ రూపొందించింది. ఈ ప్రణాళికకు ఆలయ కమిటీ ఆమోదముద్ర వేసింది. ఛైర్మన్ నాగేశ్వర్ రెడ్డి, రాము, విశ్వనాథ్, గోపాల్, జగదీశ్ నాయుడు ఉన్నారు.

News April 16, 2025

ATP: దోమల నివారణే ధ్యేయంగా పనిచేయాలి: డీఎంఓ

image

దోమల నివారణే ధ్యేయంగా పనిచేయాలని DMO ఓబులు పేర్కొన్నారు. ఈనెల 17 నుంచి అనంతపురం జిల్లాలోని 32 మండలాలలోని 64 గ్రామాలలో ఫైలేరియా వ్యాధి రక్తపూతల సర్వే నిర్వహించాలన్నారు. జిల్లా DMHO కార్యాలయంలో సబ్ యూనిట్ మలేరియా అధికారుల సమావేశం నిర్వహించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ.. గ్రామాలలో ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన పేర్కొన్నారు.

News April 16, 2025

ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన స్పాటిఫై

image

పాటల యాప్ స్పాటిఫై ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయింది. పాటలు వెతకడం నుంచి ఆర్టిస్ట్ ప్రొఫైల్ చూడటం వరకు వినియోగదారులు పలు సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. యాప్ హ్యాక్ అయిందన్న వార్తలు రాగా వాటిని సంస్థ కొట్టిపారేసింది. యాప్‌ను పునరుద్ధరించడంపై కృ‌షి చేస్తున్నామని, వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. పలు సమస్యలు వస్తున్నా యాప్‌లో యాడ్స్ మాత్రం కొనసాగుతుండటం గమనార్హం.

error: Content is protected !!