News April 13, 2025
డ్రోన్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్: డ్రోన్ కార్పొరేషన్

AP: రాష్ట్రాన్ని డ్రోన్ రాజధానిగా తీర్చిదిద్దుతామని డ్రోన్ కార్పొరేషన్ తెలిపింది. డ్రోన్ల తయారీలో ప్రపంచంలోనే ఒక బలమైన శక్తిగా అవతరిస్తామని ఆశాభావం వ్యక్తం చేసింది. ‘ప్రజలు, పాలనకు ఉపయోగపడేలా డ్రోన్ సేవలు విస్తృతం చేస్తాం. ఓర్వకల్లులో 300 ఎకరాల విస్తీర్ణంలో డ్రోన్ సిటీ అభివృద్ధి చేస్తున్నాం. ఈ నెల 21లోగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి కొత్త యూజ్ కేసెస్ను ఆహ్వానిస్తున్నాం’ అని పేర్కొంది.
Similar News
News January 18, 2026
నితీశ్ కుమార్ రెడ్డికి మంచి ఛాన్స్..

వరుస ఫెయిల్యూర్స్తో విమర్శలు ఎదుర్కొంటున్న నితీశ్ రెడ్డికి మంచి ఛాన్స్ దొరికింది. న్యూజిలాండ్తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ కీలక వికెట్లు కోల్పోగా.. విరాట్, నితీశ్ క్రీజులో ఉన్నారు. భారత్ మ్యాచ్ గెలవాలంటే వీరిద్దరి మధ్య కీలక భాగస్వామ్యం తప్పనిసరి. మరి నితీశ్ అనుభవజ్ఞుడైన కోహ్లీతో కలిసి రాణిస్తారా? కామెంట్ చేయండి.
News January 18, 2026
చేతబడి వల్లే నా భార్య మృతి: నటి భర్త

నటి, మోడల్ షెఫాలీ జరీవాలా మృతిపై ఆమె భర్త పరాగ్ త్యాగి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘షెఫాలీపై ఎవరో రెండుసార్లు చేతబడి చేశారు. తొలిసారి తప్పించుకున్నాం. కానీ రెండోసారి మరింత ఎక్కువగా చేశారు. ఎవరు, ఎందుకు, ఎలా చేశారనేది నాకు తెలియదు. కానీ ఏదో తప్పుగా జరిగిందని మాత్రం చెప్పగలను’ అని అన్నారు. గతేడాది జూన్ 27న షెఫాలీ చనిపోయారు. అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట, వెంకీ మామ చిత్రాల్లో పరాగ్ త్యాగి నటించారు.
News January 18, 2026
టాపార్డర్ ఫెయిల్.. భారత్ గెలుస్తుందా?

న్యూజిలాండ్తో 338 పరుగుల భారీ లక్ష్యఛేదనలో భారత్ తడబడుతోంది. 71 రన్స్కే 4 వికెట్లు కోల్పోయింది. రోహిత్ (11), గిల్ (23), శ్రేయస్ అయ్యర్ (3), కేఎల్ రాహుల్ (1) నిరాశపరిచారు. ప్రస్తుతం విరాట్ (31*), నితీశ్ కుమార్ రెడ్డి (0*) క్రీజులో ఉన్నారు. భారత్ స్కోర్ 13 ఓవర్లలో 71/4గా ఉంది. టీమ్ ఇండియా విజయానికి 222 బంతుల్లో 267 రన్స్ అవసరం. మరి ఈ మ్యాచులో ఏ టీమ్ గెలుస్తుందో కామెంట్ చేయండి.


