News April 13, 2025
జలపాతంలో పూర్ణామార్కెట్ యువకులు గల్లంతు

అనకాపల్లి జిల్లా సరిహద్దులోని సరియా జలపాతంలో ఆదివారం ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. విశాఖ పూర్ణ మార్కెట్కు చెందిన ఆరుగురు స్నేహితులు జలపాతం చూసేందుకు రాగా, వారిలో ఇద్దరు జలపాతంలో గల్లంతయ్యారు. దేవరాపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు ఇద్దరు యువకులు వెళ్ళగా.. ఘటనా ప్రదేశం అనంతగిరి పీఎస్ లిమిట్స్లో ఉందని తెలుసుకుని అక్కడ ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 23, 2025
విశాఖ: 600కి 598 మార్కులు

పెందుర్తిలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన అబ్దుల్ సమీరా భాను బుధవారం విడుదలైన 10వ తరగతి పరీక్ష ఫలితాలల్లో సత్తా చాటింది. 600 మార్కులకు గాను 598 మార్కులు వచ్చాయి. పెందుర్తి మండలంలో 598 మార్కులు రావడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. దీంతో విద్యార్థిని పలువురు అభినందించారు.
News April 23, 2025
నేడు విశాఖ రానున్న సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు నేడు విశాఖ రానున్నారు. సాయంత్రం గన్నవరం నుంచి విశాఖ ఎయిర్ పోర్ట్కు చేరుకుంటారు. కాశ్మీర్లో ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన విశాఖకు చెందిన చంద్రమౌలికి నివాళులు అర్పిస్తారు. భౌతికకాయం రాత్రి 10గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటుందని భావిస్తున్నారు. చంద్రబాబు విమానాశ్రయంలో మృతదేహాన్ని స్వయంగా స్వీకరించి, నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చుతారు.
News April 23, 2025
10th RESULTS: మూడో స్థానంలో విశాఖ జిల్లా

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో విశాఖ జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 28,435 మంది పరీక్ష రాయగా 25,346 మంది పాసయ్యారు. 15,045 మంది బాలురులో 13,288(88.32%) మంది, 13,390 మంది బాలికలు పరీక్ష రాయగా 12,058(90.05%) మంది పాసయ్యారు. 89.14 పాస్ పర్సంటైల్తో విశాఖ జిల్లా 3వ స్థానంలో నిలిచింది. గతేడాది 8వ స్థానంలో నిలవగా ఈసారి ఐదు స్థానాలు మెరుగుపడింది.