News April 14, 2025
NZB: రిటైర్డ్ పోలీసుల నూతన కార్యవర్గం ఎన్నిక

తెలంగాణ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిజామాబాద్ శాఖ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా ఎం.నాగేందర్, ప్రధాన కార్యదర్శిగా లింగన్న, కోశాధికారిగా టి.నారాయణతో పాటు గౌరవ అధ్యక్షులుగా 4, ఉపాధ్యక్షులుగా 3, సంయుక్త కార్యదర్శులుగా 4, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా 4, ఈసీ సభ్యులుగా 8, సలహదారులుగా 12 మందిని నియమించారు. న్యాయ సలహాదారుగా Rtd DSP మనోహర్ను ఎన్నుకున్నారు.
Similar News
News September 11, 2025
NZB: కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తే క్రిమినల్ కేసులు

నిజామాబాద్ సమీకృత కలెక్టరేట్ ఎదుట ధర్నా, రాస్తారోకో, ఎటువంటి నిరసన కార్యక్రమాలు చేయడానికి వీలులేదని రూరల్ ఎస్సై ఆరిఫ్ తెలిపారు. ఎటువంటి నిరసన కార్యక్రమాలు ఉన్న నిజామాబాద్ ఏసీపీ అనుమతితో ధర్నాచౌక్, ఓల్డ్ కలెక్టరేట్ ప్రాంతంలో చేసుకోవాలన్నారు. ఎవరైనా IDOC ఎదుట నిరసన కార్యక్రమాలు జరిపితే వారిపై క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
News September 11, 2025
NZB: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు: కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరిగేలా పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. నవీపేటలోని సిరన్పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ గురువారం పరిశీలించారు. లబ్దిదారులను కలిసి, ఇంటి నిర్మాణాలకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. గ్రామంలో 93 ఇళ్లు మంజూరు కాగా, 69 గ్రౌండింగ్ అయ్యాయని, 12 ఇళ్లు స్లాబ్ పూర్తి అయినట్లు చెప్పారు.
News September 11, 2025
నిజామాబాద్: కుక్కర్ పేలి మధ్యాహ్న భోజన కార్మికురాలికి గాయాలు

అమ్రాద్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు లలితకు తీవ్రగాయాలు అయ్యాయి. స్కూల్లో వంట చేస్తున్న సమయంలో కుక్కర్ పేలింది. దీంతో ఆమెను నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆమెను ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓమయ్య, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రపాణి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్తో చర్చించారు.