News April 14, 2025

నంద్యాల: ‘మెరుగైన వైద్యం అందాలి’

image

ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర మంత్రి ఫరూక్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో ఆదివారం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వివిధ రకాల వైద్య సేవల నిమిత్తం ఆస్పత్రికి నిత్యం వందల మంది వస్తుంటారని, వైద్యసేవల కోసం వచ్చేవారి పట్ల వైద్యులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా మెలగాలని సూచించారు.

Similar News

News March 19, 2026

రాజంపేట: వర్షంతో రైతులకు నష్టం

image

రాజంపేట మండలంలో బుధవారం రాత్రి కురిసిన అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. హస్తవరం, చెర్లోపల్లి, కొత్తపల్లి, ఆకేపాడు తదితర గ్రామాల్లో వేల ఎకరాల్లో అరటి పంటలు నేలకొరిగాయి. పంట కోత దశలో ఉండగా, ఒకే రాత్రిలో నాశనం కావడంతో రైతులు ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతిన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, నష్టపోయిన పంటలపై సర్వే చేసి నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.

News March 19, 2026

సంస్కృతికి ప్రతీక ఉగాది పచ్చడి: ఎస్పీ

image

కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో ‘శ్రీ పరాభవ’ నామ సంవత్సర ఉగాది వేడుకలు గురువారం భక్తిశ్రద్ధలతో జరిగాయి. అనంతరం ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణాన్ని SP రాజేష్ చంద్ర, ఇతర పోలీస్ అధికారులు ఆలకించారు. కార్యక్రమం అనంతరం SP స్వయంగా ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ఉగాది పచ్చడి అనేది కేవలం ఆరు రుచుల మిశ్రమం మాత్రమే కాదని, అది మన భారతీయ సంస్కృతికి, జీవిత సత్యాలకు ప్రతీక అని SP పేర్కొన్నారు.

News March 19, 2026

‘పుష్ప-2’ రికార్డు బద్దలైంది!

image

‘ధురంధర్-2’ భారత సినిమా రికార్డులను తిరగరాస్తోంది. ‘బుక్ మై షో’లో ఒక్క గంటలోనే రికార్డు స్థాయిలో 1.09 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. గతంలో ఈ రికార్డు పుష్ప-2 (1.07 లక్షలు) పేరిట ఉండేది. వీకెండ్స్‌లో ఈ మూవీ టికెట్ సేల్స్ మరింతగా పెరుగుతాయని, భారీ కలెక్షన్లు పక్కా అని నెటిజన్లు అంటున్నారు. కాగా గతేడాది వచ్చిన ధురంధర్ దాదాపు రూ.1,350 కోట్లు వసూలు చేసింది.