News April 14, 2025
NRML: ఒకే ప్రాంతం.. 4 యాక్సిడెంట్లు

నర్సాపూర్ మండలంలోని తురాటీ, చాక్పల్లి గ్రామాల వద్ద ఉన్న హైవే 61 రహదారిపై నిర్మించిన స్పీడ్ బ్రేకర్లు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. గత 21 రోజుల్లో ఒకేచోట నాలుగు ప్రమాదాలు జరిగాయి. అందులో ఇద్దరు మరణించగా మిగతా మరో ఇద్దరు తీవ్ర గాయాలతో హాస్పటల్ పాలయ్యారు. అధికారులు స్పందించి స్పీడ్ బ్రేకర్లను తొలగించాలని గ్రామస్థులు, ప్రయాణికులు కోరుతున్నారు.
Similar News
News January 16, 2026
శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో నకిలీ టికెట్ల కలకలం

శంషాబాద్ విమానాశ్రయంలో నకిలీ విమాన టికెట్ల ఉదంతం కలకలం రేపింది. ఖతర్ ఎయిర్ లైన్స్ విమానంలో దోహా వెళ్లేందుకు సిద్ధమైన 8 మంది ప్రయాణికుల టికెట్లు నకిలీవని తేలాయి. ఈ నకిలీ టికెట్ల వెనుక ఏవరైనా ఏజెంట్ల హస్తం ఉందా? లేదా ట్రావెల్ ఏజెన్సీల మోసమా? అనే కోణంలో శంషాబాద్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.
News January 16, 2026
ఎమోషన్స్ను బయటపెట్టాల్సిందే..

ప్రతిమనిషికీ భావోద్వేగాలు ఉంటాయి. వివిధ పరిస్థితులను బట్టి అవి బయటకు వస్తాయి. కానీ కొందరు తమకు కోపం, భయం, బాధ వస్తే వాటిని లోలోపలే తొక్కిపెట్టేస్తుంటారు. అవి తలనొప్పి, కడుపు సమస్యలు, గుండెదడ, నిద్రలేమి, అజీర్తి వంటి శారీరక సమస్యల రూపంలో అవి బయటకు వస్తాయంటున్నారు సైకాలజిస్టులు. ప్రతిఒక్కరూ తమలోని ఎమోషన్స్ని సన్నిహితులతో పంచుకోవాలని, అలా కుదరకపోతే సైకాలజిస్ట్ సాయం తీసుకోవాలని చెబుతున్నారు.
News January 16, 2026
కనుమ రోజున ఆవులను ఎందుకు పూజించాలి?

మన ధర్మశాస్త్రాల ప్రకారం ఆవు శరీరంలో ముక్కోటి దేవతలు ఉంటారు. అందుకే గోపూజ చేస్తే సమస్త దేవతలను పూజించిన ఫలం దక్కుతుంది. ఆవు పృష్ఠ భాగంలో మహాలక్ష్మి నివసిస్తుందని నమ్మకం. అందుకే కనుమ నాడు గోవును పూజిస్తే దారిద్య్రం తొలగి ఐశ్వర్యం సిద్ధిస్తుందని చెబుతారు. గోవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తే భూప్రదక్షిణ చేసినంత పుణ్యం లభిస్తుందని, గ్రహ దోషాలు తొలగిపోయి కుటుంబంలో సుఖశాంతులు వెల్లి విరుస్తాయని విశ్వాసం.


