News April 14, 2025

ప్రజలకు అవసరమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం: మంత్రి 

image

ప్రజలకు అవసరమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కాటారంలో మాజీ స్పీకర్ శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. 2005 మహిళా సంఘాలకు రూ.3,12,64,235 చెక్కును జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి పంపిణీ చేశారు. రూ.కోటితో నిర్మించనున్న స్పోర్ట్స్ స్టేడియం కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

Similar News

News July 4, 2025

జగిత్యాల : రోశయ్య జయంతి సందర్భంగా SP ఘన నివాళి

image

మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కె.రోశయ్య జయంతిని జగిత్యాల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రోశయ్య చిత్రపటానికి SP అశోక్ కుమార్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ముఖ్య మంత్రిగా, ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన ఆయన సేవలను స్మరించుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 16 సార్లు ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఘనత రోశయ్య దక్కించుకున్నారన్నారు.

News July 4, 2025

లక్ష్యాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు: కలెక్టర్

image

లక్ష్యాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆఫీసులో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన అంశాల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాజెక్టులు, సంక్షేమ కార్యక్రమాలను షెడ్యూల్ ప్రకారం చేపట్టాలన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు.‌ ప్రజల ఆరోగ్య పరిరక్షణపై దృష్టి పెట్టాలన్నారు.

News July 4, 2025

నాటుసారా నిర్మూల‌న‌తో స‌మాజానికి న‌వోద‌యం: కలెక్టర్

image

ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌లిగించి రాష్ట్రంలో నాటు సారాను నిర్మూలించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం న‌వోద‌యం కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించింద‌ని కలెక్టర్ లక్ష్మీశా అన్నారు. శుక్ర‌వారం క‌లెక్ట‌రేట్ ప్రాంగ‌ణంలో ఏర్పాటు చేసిన ఇగ్నైట్ సెల్‌ను అయన సంద‌ర్శించారు. జిల్లాలో ‌మొదటి ద‌శ న‌వోద‌యం సత్ఫలితాలు ఇచ్చింద‌న్నారు. ఇదే స్ఫూర్తితో న‌వోద‌యం 2.0ను ప్రారంభించామని చెప్పారు.